ఫొన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మాజీ డీసీపీ రాధకిషన్రావు పోలీసుల విచారణకు హజరయ్యేందుకు అమెరికా నుంచి నేరుగా బంజారాహిల్స్ పోలీసులు ముందుకు వచ్చారు. అప్పటి ఎస్ఐబీలో పనిచేసిన సీఐ గట్టుమల్లు పాత్ర కూడా ఉందని తేలడంతో అతనని సైతం ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రాధాకిషన్ రావు, గట్టు మల్లును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గతంలో గట్టు మల్లు ఎస్ఐబీ సీఐగా విధులు నిర్వహించారు. ఆ సమయంలోనే ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సంబంధాలున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రాధాకిషన్ రావు, గట్టు మల్లును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గతంలో గట్టు మల్లు( CI Gattu Mallu) ఎస్ఐబీ సీఐగా విధులు నిర్వహించారు. ఆ సమయంలోనే ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు సంబంధాలున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తాళం వేసి విచారణ సాగిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్కుమార్ ఈకేసు పర్యావేక్షణ అధికారిగా ఉన్నారు. రాధకిషన్రావు, సీఐ గట్టుమల్లును ఎదరుదురుగా ఉంచి ప్రశ్నలు వేస్తున్నట్లు సమాచారం.
రేపు గుడ్ఫ్రేడే కావడంతో కోర్టుకు సెలవు కావడంతో ఈ రోజు రాత్రికి న్యాయమూర్తి నివాసంలో హజరుపరిచి రిమాండ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు ఎంపీ సంతోషరావు బావ సందీప్రావును సైతం పోలీసులు విచారిస్తున్నారు. రూ.270కోట్ల నిధులతో ఇజ్రాయిల్ నుంచి ఫొన్ ట్యాపింగ్ పరికరాలు కోనుగోలు చేసనట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు.