Sangareddy:పెళ్లి ట్రాక్టర్‌ బోల్తా, ముగ్గురి మృతి

పెళ్లి కూతురి కోసం వెళ్లి ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా చికిత్స పొందుతూ మరొకరి ప్రాణం వదిలిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 20 మందికి పైగానే గాయాలయ్యాయి. మరో నలుగురి పరిస్థితి సీరియస్​గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలతో ఆందోల్ మండలం మన్సాన్పల్లి గ్రామ శివారులో విషాదం నెలకుంది.

వ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన రమేశ్​కు అందోల్ గ్రామానికి చెందిన మమతతో పెళ్లి నిశ్చయమైంది. ఈనెల 28న వివాహం ఉండడంతో ఈరోజు వధువుని తీసుకొని రావడానికి పాచారం నుంచి పెళ్లి కుమారుడికి సంబంధించిన 29 మంది బంధువులు ఓ ట్రాక్టర్​లో బయలుదేరారు.

Road Accident in Andole Mandal : అందోల్ మండలం మన్సాన్పల్లి గ్రామ శివారులోని మలుపు వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో భూదమ్మ (52), సంగమ్మ (46), అక్కడికక్కడే మృతి చెందగా ఆశమ్మ చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటనలో 24 మంది మహిళలకు గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే 108 వాహనాల్లో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు జోగిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రేపు పెళ్లి కార్యక్రమం జరగనుండగా బంధువుల రాక, హడావిడితో సందడిగా ఉన్న ఇంటిలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

Related Posts

IMD Report: దేశంలో ప్రకృతి ప్రకోపం.. గత ఏడాది 3200 మంది మృతి

భారత్‌(India)లో ప్రకృతి వైపరీత్యాలు(Natural Calamities) ఈ మధ్య తీవ్రంగా ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా దేశంలో ప్రకృతి వైపరీత్యాల ద్వారా 3200 మంది మరణించారని భారత వాతావరణ వార్షిక నివేదిక(Indian Meteorological Annual Report-2024) పేర్కొంది. ఇందులో అత్యధికంగా పిడుగుల ద్వారా 1374…

BIG BREAKING: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుల దాడి

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌(Saif Ali Khan)పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ముంబై(Mumbai)లోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగులు ఇవాళ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఆయనపై కత్తితో అటాక్(Knife Attack) చేశారు. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *