ఓటీటీలోకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. మే 31 న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైన ఈ మూవీ జూన్‌ 14న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక ప్రకటన చేసింది. తెలుగు,తమిళ్‌,కన్నడ,మలయాళంలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలిపింది.

Gangs Of Godavari OTT Release Update : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి అంజలి ఫిమేల్ లీడ్స్ గా నటించారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మే 31 న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.

ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే సుమారు 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పటికీ పలు థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా రిలీజై నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. తాజాగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ జూన్‌ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక ప్రకటన చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాని స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది.

Related Posts

Naga Chaitanya: స్టైలిష్ లుక్‌లో చైతూ.. ‘NC24’ షూటింగ్ షురూ

‘తండేల్’ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు హీరో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), డైరెక్టర్ చందూ మొండేటి(Chandu Mondeti) తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్(Box Office) వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *