AP:అచ్యుతాపురం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం : సీఎం చంద్రబాబు

ManaEnadu:ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది మరణించిన విషయం తెలిసిందే. దాదాపు 36 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాద బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖపట్నం చేరుకున్న ఆయన మెడికవర్‌ ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడారు. వారి నుంచి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండమని, తాను చూసుకుంటానని భరోసా కల్పించారు.

అనంతరం వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. బాధితులతోనూ మాట్లాడి త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భయపడకుండా ధైర్యంగా ఉండాలని, వారికి చెప్పారు. అనంతరం బాధితుల కుటుంబసభ్యులతో మాట్లాడారు.

ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చెప్పారు. ఈ ప్రమాదంలో 17 మంది మరణించగా.. 36 మందికి గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రుల్లో 10 మంది తీవ్రంగా, 26 మంది స్వల్పంగా గాయపడ్డారని వెల్లడించారు. ఎంత ఖర్చు అయినా బాధితులందరికీ మెరుగైన వైద్యమందిస్తామన్న చంద్రబాబు.. అవసరమైన వారికి ప్లాస్టిక్‌ సర్జరీ కూడా చేయిస్తామని హామీ ఇచ్చారు.

మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు. తీవ్ర గాయాలపాలైన వారికి రూ.50లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు.. గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని.. దాని పర్యవసానమే ఈ ప్రమాదం అని అన్నారు.

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

IBPS PO 2025 Notification: డిగ్రీ అర్హతతో IBPSలో భారీ నోటిఫికేషన్.. 5,208 పోస్టులు భర్తీ! ఇలా అప్లై చేయండి!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) మరియు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా రెండు కీలక నోటిఫికేషన్ల( Notifications)ను విడుదల చేశాయి. బ్యాంకింగ్, ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. IBPS PO/MT…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *