Nandigam Suresh: వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ అరెస్ట్

ManaEnadu:వైస్సార్సీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ (Nandigam Suresh) అరెస్టు అయ్యారు. హైదరాబాద్‌లో ఆయన్ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అక్కడి నుంచి ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం (TDP Office)పై దాడి కేసులో ఆయనతో పాటు మరికొందరు వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని వారు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు (AP High Court) కొట్టేసింది. దీంతో రంగంలోకి దిగిన తుళ్లూరు పోలీసులు సురేశ్‌ను అరెస్టు చేసేందుకు బుధవారం రోజున ఉద్దండరాయునిపాలెంలోని ఆయన ఇంటికి వెళ్లారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూసినా.. ఆయన అక్కడ లేరని తెలియడంతో వెనుదిరిగారు. అరెస్టు భయంతో సురేశ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ చేసినట్లు సమాచారం. అయితే పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో ఆరా తీశారు.

సిగ్నల్స్ ఆధారంగా ఆయన హైదరాబాద్‌ వెళ్లారని తెలుసుకున్న పోలీసులు త్వరగా అదుపులోకి తీసుకోకపోతే హైదరాబాద్ నుంచి విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న సమాచారంతో వెంటనే నగరానికి వెళ్లారు. అలా పక్కా సమాచారంతో హైదరాబాద్ వెళ్లిన పోలీసులు హైదరాబాద్​లో ఆయన్ను అరెస్ట్‌ (YSRCP Ex MP Arrest) చేశారు. అనంతరం హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లాలోని మంగళగిరికి తీసుకువచ్చారు.

మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ (Devineni Avinash), తలశిల రఘురామ్​లు కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. వారి కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న విజయవాడ డిప్యూటీ మేయర్‌ శైలజ భర్త శ్రీనివాస రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇతర నిందితుల కోసం గాలింపు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Related Posts

Parliament: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కేంద్రం అనాసక్తి 

ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంట్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశం నిర్వహించడానికి కేంద్రం అనాసక్తి చూపుతున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాబోయే…

West Indies cricket team: ఒలింపిక్స్ లో వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు అవకాశం ఛాన్స్ దక్కేనా? 

లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ గేమ్స్‌లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహించాలి అనే దానిపై క్రికెట్ వెస్టిండీస్ (CWI) ఐసీసీని స్పష్టత కోరుతోంది. సాధారణంగా, వెస్టిండీస్ క్రికెట్ లో 15 దేశాలు లేదా ప్రాంతాల సమాహారంగా ఉంటుంది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *