అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు భారతీయులు మృతి.. అందులో ముగ్గురు హైదరాబాద్‌ వాసులు

ManaEnadu:ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన చాలా మంది భారతీయ యువత అక్కడి కాల్పుల్లో, రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. బంగారు భవిష్యత్ కోసం వెళ్లి విగత జీవులుగా తిరిగొస్తున్న తమ పిల్లలను చూసి కన్నవాళ్లు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇప్పటికీ విదేశీ ప్రమాదాల్లో ఎంతో మంది భారతీయులు మృతి చెందుతున్నారు. తాజాగా అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం అన్నాలోని జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు హైదరాబాద్ యువకులు మరణించారు.

టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నం.75లో ఘోర జరిగిన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు భారతీయులు దుర్మరణం చెందారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్‌ (Hyderabad Youths)కు చెందిన వారు ఉన్నారు. మరో వ్యక్తి తమిళనాడు వాసిగా గుర్తించారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఆర్యన్‌ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్‌ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్‌ ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. కార్‌ పూలింగ్‌ ద్వారా ఈ నలుగురు బెన్‌ టోన్‌విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కినట్లు తెలిపారు. వరుసగా 5 వాహనాలు ఒకదానినొకటి అతి వేగంగా ఢీకొన్నాయని (Road Accident in Texas) వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు.

డల్లాస్‌లో బంధువును కలిసి ఆర్యన్‌ రఘునాథ్, భార్యను కలిసేందుకు లోకేశ్, యూనివర్సిటీకి వెళ్తున్న దర్శిని వాసుదేవన్, ఫరూఖ్‌ ఈ కారులో ఎక్కగా.. వీరు ప్రయాణిస్తున్న వాహనానికి మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో వారు బయటకు రాలేకపోయినట్లు సమాచారం. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోవడంతో కార్‌ పూలింగ్‌ యాప్‌లో నమోదైన వివరాల ఆధారంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.

Related Posts

RGకర్ డాక్టర్ కేసు.. దోషిగా సంజయ్‌ రాయ్‌.. రేపే శిక్ష ఖరారు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్​జీ కర్ ఆస్పత్రి (RG Kar Hospital) ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం కేసులో కోల్‌కతాలోని సీల్దా కోర్టు శనివారం సంచలన తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. అతడికి జనవరి…

IMD Report: దేశంలో ప్రకృతి ప్రకోపం.. గత ఏడాది 3200 మంది మృతి

భారత్‌(India)లో ప్రకృతి వైపరీత్యాలు(Natural Calamities) ఈ మధ్య తీవ్రంగా ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా దేశంలో ప్రకృతి వైపరీత్యాల ద్వారా 3200 మంది మరణించారని భారత వాతావరణ వార్షిక నివేదిక(Indian Meteorological Annual Report-2024) పేర్కొంది. ఇందులో అత్యధికంగా పిడుగుల ద్వారా 1374…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *