మల్లాపూర్ డివిజన్ అభివృద్ధి పనులు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధుల విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మల్లాపూర్ గ్రీన్ హిల్స్ కాలనీ సంబురాలు చేశారు. ప్రజలకు మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు , మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ ,NSUI, మైనారిటీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.