Viral News: మహాశివుడితోనే ఆటలా? రీల్స్ చేస్తూ నదిలో పడిపోయిన యువతి

Mana Enadu: సోషల్ మీడియా(Social Media) మోజులో పడిన నేటి యువత రోజురోజుకు బరిదెగిస్తున్నారు. ఇన్‌స్టా రీల్స్(Insta reels), యూట్యూబ్ షాట్స్​(Youtube shorts)పై పిచ్చి పీక్స్​కు పోయి లైకుల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు యువత(Youth). రోజురోజుకీ ఈ పిచ్చి వ్యసనంగా మారి తామేం చేస్తున్నామో, అది ఎంతటి ప్రమాదానికి దారి తీస్తుందోననే స్పృహ లేకుండా రీల్స్‌ చేయడంలో మునిగిపోతున్నారు. ఇలాంటివి చేస్తూ కొన్ని సందర్భాల్లో ప్రాణాలే కోల్పోతున్నారు. కన్నవాళ్లకు కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరాఖండ్‌(Uttharakhand)లోని

హరిద్వార్‌(Haridwar)లో చోటు చేసుకుంది. సదరు యువతి చేసిన పిచ్చి పని వీడియో సోషల్ మీడియాలో వైరల్‌(Viral)గా మారింది. దీనిపై నెటిజన్లు(Netizens) రకరకాలుగా కామెంట్స్(Comments) చేస్తున్నారు. ఇంతకీ ఏమైందో తెలుసుకుందాం పదండీ..

 ఇంతకీ ఏం జరిగిందంటే..

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ క్షేత్రంలోని గంగానదిలో ఓ యువతి(Girl) స్నానమాచరించింది. అంతలోనే అక్కడ నది ఒడ్డున ఏర్పాటు చేసిన శివలింగాన్ని చూసి అటుగా వెళ్లింది. శివలింగం దగ్గరకు వెళ్లి బాధపడినట్లుగా చేస్తూ.. కన్నీటితో ఆ దేవదేవుడిని పూజిస్తున్నట్లు నటించింది.
అనంతరం నదిలో భద్రత కోసం ఏర్పాటు చేసిన కర్రల రైలింగ్‌(Railing)పై నడుచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఆ యువతి అదుపు తప్పి గంగానది(Ganga River)లో పడిపోయింది. ఆక్రమంలో ఆమెకు గాయాలూ అయ్యాయి. అనంతరం ఆమె నది ప్రవాహంలో కొట్టుకుపోయింది. అది అక్కడున్న వారు గమనించి కాపాడేందుకు నదిలోకి దూకేలోపే ఆమె చాలా దూరం కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తూ రైలింగ్‌ రాడ్ పట్టుకుని ఒడ్డుకు చేరుకోగలిగిందా యువతి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది.

పిచ్చి పనులతో ప్రాణాలు కోల్పోవద్దు..
అయితే యువతి రీల్స్(Reels) ఘటన వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. పిచ్చి పనులతో ప్రాణాలు కోల్పోవద్దంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఆమె చేసిన తెలివి తక్కువ పనికి ఆ మహాశివుడే తగిన గుణపాఠం చెప్పాడని అన్నారు. ఇంకొందరు సోషల్ మీడియాలో ఫేమ్‌, వ్యూస్‌ కోసం ఇలాంటి వారు దేవుడిని కూడా వదిలిపెట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికైనా రీల్స్ చేసే వారు ఇలా ప్రాణాలను ఫణంగా పెట్టి చేయడం మానుకోవాలని మరికొందరు హితవు పలుకుతున్నారు.

Related Posts

Fish Venkat: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్యనటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ (Fish Venkat) శుక్రవారం (జులై 18) రాత్రి కన్నుమూశారు. 53 ఏళ్ల ఆయన అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం(serious illness)తో…

Air India plane Crash: ఎయిరిండియా విమాన ప్రమాదంపై నిరాధార ఆరోపణలు చేయొద్దు: AAIB

అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన(Air India plane Crash Incident)పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఇచ్చిన నివేదిక(Report)పై విభిన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏఏఐబీ స్పందించింది. ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని, దీనిపై…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *