Big Breaking| రూ.300కోట్ల మోసం..లాభాలంటూ ముంచేశారు..

అధిక లాభాలు ఇస్తామంటూ పెద్ద ఎత్తున పెట్టుబడులు సేకరించారు. లక్ష పెట్టుబడికి పది నెలల్లో రూ.1.40లక్షల ఇస్తామంటూ ప్రచారం ఊదరగొట్టారు

ఉప్పల్​లో జేవీ బిల్డర్స్​ పేరుతో రియల్​ ఎస్టేట్​ వ్యాపారాన్ని కర్నూల్​కు చెందిన లక్ష్మీనారాయణ, జ్యోతిలు ఆఫీస్​ ప్రారంభించారు. రెండేళ్లుగా పెట్టబడులు పెట్టినవారికి ప్రతినెలా సక్రమంగా బ్యాంకుఖాతాల్లో చెల్లింపులు చేశారు. ఆపై కొత్తవారితో పెట్టుబడులు పెట్టిస్తే మరో 4శాతం అదనంగా కమిషన్​ ఇస్తామంటూ ఆశ కల్పించారు.


అప్పటికే ఒక్కొక్కరూ అప్పులు తీసుకొచ్చి రూ.30లక్షల నుంచి రూ.50లక్షల వరకు 300మందికి పైగా పెట్టుబడులు పెట్టారు. కమిషన్ల కోసం మరో 7వేల మంది చేత పెట్టుబడులు పెట్టించారు.
గత నెల పిభ్రవరి నుంచి చెల్లింపులు సక్రమంగా జరగకపోవడంతో బాధితులు ఒక్కొక్కరిగా ఆఫీస్​కు చేరుకున్నారు.అప్పటికే జేవీ బిల్డర్స్​ దుకాణం ఎత్తేశారు. ఇలా పెట్టుబడులు పెట్టినవారిలో ప్రభుత్వ ఉద్యోగులే పెద్ద సంఖ్యలోఉన్నారని సమాచారం. సోమవారం రాత్రి వంద మందికి పైగా బాధితులు ఉప్పల్​ పోలీసులకు పిర్యాదు చేశారు. రాజు అనే రూ.18లక్షలు పెట్టుబడి పెట్టడంతోపాటు బంధువులు, స్నేహితులతో రూ.2.50కోట్ల పెట్టుబడులు పెట్టించి మోసపోయానని పిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts

Bahraich : యూపీని వణికిస్తున్న తోడేళ్లు.. దాడులకు అదే కారణమా?

ManaEnadu:ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రాన్ని తోడేళ్లు వణికిస్తున్నాయి. ముఖ్యంగా బహరయిచ్‌ జిల్లాలో తోడేళ్ల దాడులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సుమారు 50 గ్రామాల ప్రజలు తోడేళ్ల వల్ల క్షణక్షం భయంతో బతుకుతున్నారు. అయితే ఇలా తోడేళ్లు వరుస దాడులకు…

రేప్ చేస్తే లైఫ్‌టైమ్ జైల్లోనే.. ‘అపరాజిత బిల్లు’కు బంగాల్ అమోదం

ManaEnadu:పశ్చిమ బెంగాల్‌ (West Bengal) కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన (Kolkata Doctor Rape Murder) దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు, ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై పెద్ద…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *