మన Enadu:రాజేంద్రనగర్ సర్వీస్ రోడ్డులో వాటర్ ట్యాంకర్ అతివేగానికి మూడేళ్ల చిన్నారి బలి కావాల్సిన ఘటన గురువారం జరిగింది.
పాతబస్తీకి చెందిన కుటుంబ సభ్యులు కారులో హిమాయత్సాగర్ సర్వీస్లో రోడ్డులో ప్రయాణం చేస్తున్నారు. ఎదురుగా వస్తున్న వాటర్ ట్యాంకర్ అతివేగంగా వచ్చి ఢికొంది. ఈఘటనలో చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా మరో కుటుంబ సభ్యుడి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానకంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.