Bandi Sanjay: కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఇవాళ రైతు దీక్ష చేయనున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆయన రైతు దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్ తో ఆయన ఈ దీక్ష చేయనున్నారు. 2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం, పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలనే డిమాండ్ తో దీక్ష చేపట్టనున్నారు బండి సంజయ్. తాను చేపట్టబోతున్న దీక్షకు రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలని ఇప్పటికే బండి సంజయ్ కోరారు.
Tollywood: 18న ఎగ్జిబిటర్లతో ఫిలీం ఛాంబర్ కీలక సమావేశం.. ఎందుకంటే?
థియేటర్లను అద్దె ప్రాతిపదికన(Theaters on rental basis) మీద కాకుండా, పర్సంటేజ్(Percentage)ల లెక్కన నడపాలనే వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఇప్పటికే ఈస్ట్, కృష్ణా, సీడెడ్, నైజాంల్లో ఈ నినాదం ఊపు అందుకుంది. దీంతో రెండు రాష్ట్రాల ఎగ్జిబిటర్ల(Exhibitors)తో ఫిలిం…