HYD| సింగిరెడ్డి కోసం రంగంలోకి KTR

మన ఈనాడు: ఉప్పల్ కాంగ్రెస్ టిక్కెట్ ఆశించిన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి టిక్కెట్ దక్కకపోవడంతో దంపతులు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరులుగా సింగిరెడ్డి దంపతులు ఉన్నారు

రంగంలోకి దిగిన KTR
శనివారం సాయంత్రమే దాసోజు శ్రవణ్ సింగిరెడ్డిను కలిసి BRS పార్టీలోకి ఆహ్వానం పలికారు. AS రావు నగర్ కార్పొరేటర్ గా సోమశేఖర్ రెడ్డి సతీమణి శిరీష రెడ్డి గెలిచారు. ఈ రోజు సాయంత్రం మంత్రి KTR నేరుగా కుషాయిగూడ లోని సింగిరెడ్డి నివాసానికి వచ్చి పార్టీలోకి ఆహ్వానం పలికేందుకు ఏర్పాట్లు సైతం జరుగుతున్నట్లు సమాచారం.

ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉండటంతో పాటు అదే పార్టీ నుంచే బయటకు వస్తున్న నేతలకు అధికార పార్టీ ఉన్నత పదవులు అందించడానికి వెనకడుగు వేయడం లేదు.ఉప్పల్ రాజకీయాలు గ్రేటర్ లో రసవత్తరంగా మారాయి.

Related Posts

కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. జారీ అప్పుడే!

Mana Enadu:తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకెళ్తోంది. అందులో భాగంగా ఎన్నికలకు ముందు ప్రకటించినట్లుగానే ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ వస్తోంది. ఉచిత బస్, ఆరోగ్య శ్రీ లిమిట్ పెంపు, 200యూనిట్ల ఫ్రీ కరెంట్ వంటి పథకాలను…

TTD: టీటీడీ మరో కీలక నిర్ణయం.. ఆ భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు పునరుద్ధరణ..!

TTD: రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లపై టీటీడీ ఈఓ సమీక్ష నిర్వహించింది. ప్రత్యేక దర్శనం టికెట్లను వివిధ గవర్నమెంట్ శాఖల అధికారులకు ఇవ్వాలా వద్దా అన్నదానపై చర్చ నడుస్తోంది.ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? ఇవ్వాల్సి వస్తే ఏ ప్రాతిపదికన కల్పించాల్సి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *