Road Accident: ప్రయాగ్‌రాజ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. మహాకుంభమేళా(Maha Kumbhamela)కు భక్తులతో వెళుతున్న బస్సు(Bus)ను బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. కాగా వీరంతా ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని కోర్బా జిల్లా నుంచి UP ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణీసంగమం(Triveni Sangamam)లో స్నానం ఆచరించేందుకు వెళ్తున్నారు. అయితే ప్రయాగ్ రాజ్-మిర్జాపూర్‌ రోడ్డు(Prayagraj-Mirzapur highway)పై బొలెరో వాహనం బస్సును ఢీకొట్టింది. మృతదేహాలను పోస్టుమార్టం(Postmortem of dead bodies) కోసం స్వరూప్ రాణి మెడికల్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఘటనపై సీఎం యోగి ఆరా

అటు సమాచారం అందుకున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కాగా ఇటీవల మహాకుంభ మేళాలో మౌని అమావాస్య(Mouni Amavasya) సందర్భంగా జరిగిన తొక్కిసలా ఘటనలో 30 మంది మరణించగా.. 60 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే.

Related Posts

సొంతగడ్డపై సన్‘రైజర్స్’.. రాజస్థాన్‌పై 44 రన్స్‌ తేడాతో గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) అదరగొట్టింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌(RR)తో జరిగిన మ్యాచులో 44 పరుగుల తేడాతో గ్రాండ్ విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో ఇరు జట్ల బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి…

Sikindar: ‘సికిందర్’ ట్రైలర్ రిలీజ్.. వింటేజ్ లుక్‌లో సల్మాన్‌భాయ్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్(Salman Khan), ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్(A.R. Murugadoss) కాంబోలో తెరకెక్కిన మూవీ ‘సికిందర్(Sikindar)’. ఈ మూవీలో సల్మాన్‌కు జోడీగా సక్సెస్‌ఫుల్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) నటిస్తోంది. సత్యరాజ్, కాజల్ అగర్వాల్(Kajal Agarwal)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *