The Railway Men Teaser: ఓటీటీలోకి వచ్చేస్తోన్న రియల్ స్టోరీ.. ఆకట్టుకుంటున్న టీజర్

మన ఈనాడు:

1984లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన గ్యాస్ విపత్తు ఆధారంగా యశ్ రాజ్ ఫిలింస్ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘ది రైల్వే మెన్’. ఇందులో ఆర్ మాధవన్, కెకె మీనన్, దివ్యేందు శర్మ, ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ సిరీస్ టీజర్ విడుదల చేయగా.. ఈ సిరీస్‌లో మాధవన్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ రతీ పాండే పాత్రలో కనిపించనున్నారు. కాగా కెకె మీనన్ స్టేషన్ మాస్టర్. దీంతో పాటు దివ్యేందు కానిస్టేబుల్‌గా, బాబిల్ లోకో పైలట్‌గా నటిస్తున్నారు.

ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలను, వెబ్ సిరీస్‏లోను తీసుకువస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అటు థియేటర్లలో బ్లాక్ బస్టర్ చిత్రాలు రన్ అవుతున్నా.. ఓటీటీలకు ఆదరణం మాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకు అనేక వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించగా.. ఇప్పుడు యావత్ దేశాన్ని కుదిపేసిన ఘటన ఆధారంగా వెబ్ సిరీస్ తెరకెక్కించారు. తాజాగా ఆ సిరీస్ టీజర్ విడుదల చేశారు మేకర్స్. 1984లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన గ్యాస్ విపత్తు ఆధారంగా యశ్ రాజ్ ఫిలింస్ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘ది రైల్వే మెన్’. ఇందులో ఆర్ మాధవన్, కెకె మీనన్, దివ్యేందు శర్మ, ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ సిరీస్ టీజర్ విడుదల చేయగా.. ఈ సిరీస్‌లో మాధవన్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ రతీ పాండే పాత్రలో కనిపించనున్నారు. కాగా కెకె మీనన్ స్టేషన్ మాస్టర్. దీంతో పాటు దివ్యేందు కానిస్టేబుల్‌గా, బాబిల్ లోకో పైలట్‌గా నటిస్తున్నారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి నలుగురూ ప్రాణాలను కాపాడే పనిలో ఉన్నారని టీజర్ చూస్తే తెలుస్తుంది.

దీపావళి సందర్భంగా ఈ 4-భాగాల సిరీస్ నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి నూతన దర్శకుడు శివ్ రావైల్ దర్శకత్వం వహించగా, ఆయుష్ గుప్తా కథను అందించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సిరీస్‌ను 2021లో ప్రకటించగా.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మించారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *