Kite Festival: సంక్రాంతి వేళ కైట్ ఫెస్టివల్.. అసలేంటీ స్టోరీ?

సంక్రాంతి(Sankranti) వచ్చిందంటే చాలు.. కోడి పందేలు.. ఎద్దుల బండ లాగుడు పోటీలు.. అంతకు మించి పతంగులు(Kites) ఎగురవేయడం.. ఎక్కడెక్కడున్నా వారంతా తమతమ సొంతూళ్లకు చేరుకొని ఇంటిళ్లిపాది ఆనందంగా జరుపుకునే ఫెస్టివల్ సంక్రాంతి. ఒక్కమాటలో చెప్పాలంటే APలో కోడిపందాలు ఆడటం, TGలో గాలిపటాలు(Kites) ఎగరవేయడం దీని ప్రత్యేకత. రెండు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సంబరాలను ప్రతిబింబించే ప్రతీకలుగా వీటిని భావిస్తారు. తెలంగాణలో పతంగుల వేడుకకు HYD శతాబ్దాలుగా కేంద్రం. కుతుబ్‌షాహీల కాలం నుంచి ఈ ప్రాంతంలో గాలిపటాలకు ఆదరణ ఉందని చరిత్రకారుల అభిప్రాయం. ఇక్కడి సంస్కృతిలో పతంగులు ఎలా భాగం అయ్యాయి? సంక్రాంతి పండగకు పతంగులు ఎగురవేయడానికి ఏమైనా సంబంధం ఉందా? అనేవి తెలుసుకుందామా?

కుతుబ్ షాహీల కాలం నుంచే..

కుతుబ్ షాహీల(Qutub Shahi) పాలనలో హేమంత రుతువులో కాగితాలతో తయారుచేసిన పతంగులను, మూలికలు రుద్దిన దారాల సహాయంతో ఎగురవేసేవారు. ఆ తర్వాత అసఫ్ జాహీ(Asaf Jahi)ల పాలనలోనూ ఇది కొనసాగింది. ఆరవ నిజాం ఆధ్వర్యంలో హైదరాబాద్ మైదానాల్లో పెద్ద ఎత్తున పతంగుల పోటీలు జరిగేవని చరిత్రకారులు చెబుతున్నారు. 1990 వరకు హైదరాబాద్ పాతబస్తీ(Oldc City)లో పతంగుల పోటీలు జరిగేవి” అని కొత్త తెలంగాణ చరిత్ర బృందం(Telangana History Team) పేర్కొంది. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని కొన్ని ఇరుకైన వీధులు పతంగుల తయారీ కేంద్రాలు. పతంగుల తయారీ ఇక్కడ కుటీర పరిశ్రమ. హైదరాబాద్ కాలనీల్లో మతాలకతీతంగా కమిటీలు ఏర్పడి పోటీలు నిర్వహించేవారట. ఇక ఈసారి జనవరి 13 నుంచి 15 వరకు పరేడ్ గ్రౌండ్లో ఈ కైట్ ఫెస్టివల్ జరగనుంది.

 

ప్రత్యేక ఆకర్షణగా గాలిపటాల మ్యూజియం

ఇక ఇండియా(India)లో గాలిపటాలకు గుజరాత్‌లోని అహ్మదాబాద్(Ahmedabad) ప్రసిద్ది చెందింది. ఇక్కడి గాలిపటాల మ్యూజియం పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భారత్‌లో తొలిసారి 1989లో అహ్మదాబాద్ వేదికగా అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాలు(International Kite Festivals) జరిగాయి. తెలంగాణలో 2016 నుంచి అంతర్జాతీయ స్థాయి కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. మొదట్లో అగాఖాన్ అకాడమీ(Aga Khan Academy)లో నిర్వహించిన ఈ ఉత్సవాలు గత కొన్నేళ్లుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌(Secunderabad Parade Ground)లో జరుగుతున్నాయి. గతంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, కంబోడియా, మలేషియా, వియత్నాం, ఇటలీ, దక్షిణఆఫ్రికా, శ్రీలంక దేశాలనుంచి ఔత్సాహులు ఇక్కడి పోటీల్లో పాల్గొన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *