కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. ఎన్‌కౌంటర్లో 3 మావోల మృతి

ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. మంగళవారం (మార్చి 25) దంతెవాడ జిల్లాలో భద్రతా బలగాల(Security forces)తో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు(Maoists) మరణించారు. బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతం(Forest)లో నక్సల్స్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్(Combing) నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.

29 Maoists killed in major anti-Naxal operation in Chhattisgarh's Kanker | Latest News India - Hindustan Times

భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల స్వాధీనం

కాగా ఘటనాస్థలంలో మూడు డెడ్ బాడీలతోపాటు ఆయుధాలు, పేలుడు పదార్థాల(Weapons and explosives)ను పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్(Operation) కొనసాగుతోంది. కాగా ఈనెల 20న భారీ ఎన్ కౌంటర్లు(Encounters) జరిగిన విషయం తెలిసిందే. బీజాపూర్ కాంకెర్ జిల్లాల్లో జరిగిన కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు చోటు చేసుకున్న పలు ఎన్ కౌంటర్లలో దాదాపు 90 మంది నక్సల్స్ మరణించినట్లు సమాచారం.

Related Posts

Sigachi industry: రియాక్టర్ పేలిన ఘటన.. 39కి చేరిన మృతుల సంఖ్య

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం(Pashamaiaram)లోని సిగాచీ పరిశ్రమ(Sigachi industry)లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం(Fire Accident)లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య నేటికి (జులై 4) 39కి చేరింది. పటాన్‌చెరులోని ధ్రువ ఆస్పత్రి(Dhruva Hospital)లో…

Pashamailaram Explosion: రియాకర్ట్ పేలిన ఘటనలో 36 మంది మృతి.. సిగాచీ కంపెనీపై కేసు

సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలో ఉన్న సిగాచీ రసాయనిక పరిశ్రమ(Sigachi Chemical Industry)లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు(Police Case) నమోదు చేశారు. బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్(Yashwant) ఫిర్యాదు మేరకు పరిశ్రమ యాజమాన్యం సిగాచీపై BDL భానూర్ పోలీసులు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *