
ఛత్తీస్గఢ్(Chhattisgarh) దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. మంగళవారం (మార్చి 25) దంతెవాడ జిల్లాలో భద్రతా బలగాల(Security forces)తో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు(Maoists) మరణించారు. బీజాపూర్ దంతెవాడ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతం(Forest)లో నక్సల్స్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్(Combing) నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.
భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల స్వాధీనం
కాగా ఘటనాస్థలంలో మూడు డెడ్ బాడీలతోపాటు ఆయుధాలు, పేలుడు పదార్థాల(Weapons and explosives)ను పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్(Operation) కొనసాగుతోంది. కాగా ఈనెల 20న భారీ ఎన్ కౌంటర్లు(Encounters) జరిగిన విషయం తెలిసిందే. బీజాపూర్ కాంకెర్ జిల్లాల్లో జరిగిన కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు చోటు చేసుకున్న పలు ఎన్ కౌంటర్లలో దాదాపు 90 మంది నక్సల్స్ మరణించినట్లు సమాచారం.