అన్నమయ్య జిల్లాలో దారుణం.. ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తులు మృతి

అన్నమయ్య జిల్లాలో  ఏనుగులు సృష్టించిన బీభత్సానికి ముగ్గురు భక్తులు ప్రాణాలు విడిచారు. మహాశివరాత్రి పర్వదినాన్ని (Maha Shivaratri) పురస్కరించుకుని కొందరు భక్తులు శివయ్య ఆలయానికి వెళ్తుండగా ఏనుగుల గుంపు వారిపై దాడికి తెగబడింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.

అసలేం జరిగిందంటే..?

ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద ఏనుగులు భక్తులపై దాడి (Elephant Attack) చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. శివరాత్రిని పురస్కరించుకుని వై.కోటకు చెందిన భక్తులు ఆలయానికి వెళ్తుండగా వారిపై ఏనుగులు దాడి చేశాయని అధికారులు వెల్లడించారు.

సమగ్ర నివేదిక ఇవ్వాలి

ఏనుగుల దాడి ఘటనపై డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) స్పందించారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీధర్‌ అసెంబ్లీ నుంచి హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించాలని ఆదేశించారు. ఈ గటనపై సమగ్ర నివేదిక అందజేయాలని అటవీశాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Related Posts

SLBC టన్నెల్ ప్రమాదం.. ఆ ఏడురురి ఆచూకీ ఇక దొరకనట్టేనా?

శ్రీశైలం ఎడమగట్టు SLBC టన్నెల్ ప్రమాదం(Tunnel Accident) జరిగి నేటికి 28 రోజులు గడిచిపోయాయి. కానీ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిలో ఇప్పటికి వరకు ఒకరి మృతదేహం మాత్రమే లభించింది. ఇంకా ఏడుగురు కార్మికుల(Workers) కోసం ముమ్మరంగా గాలిస్తున్నా ఇప్పటికీ వారి…

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు.. స్పందించిన రానా లీగల్ టీమ్

బెట్టింగ్ యాప్‌ల ప్రచారం(Promotion of betting apps)పై ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి(Rana Daggubati) టీమ్ స్పందించింది. రానా నైపుణ్యాధారిత గేమ్‌లకు మాత్రమే ప్రచారకర్తగా వ్యవహరించారని, అయితే ఆయన చేసిన ప్రకటన గడువు 2017తోనే ముగిసిందని వెల్లడించింది. బెట్టింగ్ యాప్‌ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *