బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 5,208 ప్రొబెషనరీ ఆఫీసర్ (PO)/ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు జులై 1 నుండి జులై 21, 2025 మధ్య IBPS అధికారిక వెబ్సైట్ www.ibps.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హత:
దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా స్ట్రీమ్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొందాలి.
వయోపరిమితి:
2025 ఆగస్టు 1 నాటికి అభ్యర్థి వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయోపరిమితిలో సడలింపు:
OBC – 3 సంవత్సరాలు
SC/ST – 5 సంవత్సరాలు
దివ్యాంగులు – 10 సంవత్సరాలు
ఎంపిక విధానం:
ప్రిలిమినరీ పరీక్ష (Prelims)
మెయిన్స్ పరీక్ష (Mains)
ఇంటర్వ్యూ
పరీక్ష తేదీలు:
ప్రిలిమ్స్: ఆగస్టు 2025 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)
ఫలితాలు: సెప్టెంబర్ 2025
మెయిన్స్ పరీక్ష: అక్టోబర్ 2025
దరఖాస్తు రుసుము:
జనరల్, OBC: ₹850
SC, ST, PwD: ₹175
దరఖాస్తు విధానం:
1. అధికారిక వెబ్సైట్ www.ibps.in కి వెళ్లండి
2. హోమ్పేజీలో PO Apply Online లింక్పై క్లిక్ చేయండి
3. మీ పర్సనల్ డిటైల్స్ నమోదు చేయండి
4. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి
5. ఫీజు చెల్లించి, దరఖాస్తును సబ్మిట్ చేయండి








