Pahalgam Attack: పహల్‌గామ్ టెర్రర్ ఎటాక్.. భారత్ తీసుకున్న నిర్ణయాలివే!

జమ్మూకశ్మీర్‌(J&K)లోని పహల్గామ్‌(Pahalgam)లో జరిగిన ఉగ్రదాడి(Terror Attack)లో 26 మంది ప్రాణాలను కోల్పోయిన భారత్.. ఈ దాడి ఘటనలో బయటి దేశం ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తు(Investigation)లో తేలింది. దీంతో భారత ప్రభుత్వం పాకిస్థాన్‌(Pakistan)పై పలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించిన అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (Cabinet Committee on Security) ఈ మేరకు కీలక చర్యలకు ఆమోదం తెలిపింది.

Key takeaways from the Cabinet Committee on Security meeting — The Kashmir Monitor

సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత

భారత్ తీసుకున్న అత్యంత కీలకమైన చర్యల్లో 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని(Indus Waters Treaty) తక్షణమే నిరవధికంగా నిలిపివేయడం. ఈ ఒప్పందం ప్రకారం సింధు, దాని ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల జలాలను ఇరు దేశాలు పంచుకుంటున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని(Cross-border terrorism) పాకిస్థాన్ శాశ్వతంగా విడనాడే వరకు ఈ ఒప్పందం అమలులో ఉంటుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ(Foreign Secretary Vikram Misri) స్పష్టం చేశారు. అలాగే అటారీ-వాఘా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌(Attari-Wagah Integrated Check Post)ను తక్షణమే మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే చెల్లుబాటు అయ్యే అనుమతులతో సరిహద్దు దాటిన వారు మే 1వ తేదీలోగా తమ దేశానికి వెళ్లవచ్చని సూచించారు.

వారంతా 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలి

సార్క్ వీసా(SAARC Visa) మినహాయింపు పథకం (SVES) కింద పాకిస్థానీయులకు వీసాలు నిలిపివేశారు. ప్రస్తుతం ఈ Visaపై భారత్‌లో ఉన్న పాక్ జాతీయులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇంకా, న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లోని నేవల్, ఎయిర్ అడ్వైజర్ల(Naval and Air Advisors)ను ‘పర్సన నాన్ గ్రాటా’ (Unwanted people)గా ప్రకటించారు. వారు వారం రోజుల్లోగా భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇరు దేశాల హైకమిషన్లలోని మొత్తం సిబ్బంది సంఖ్యను ప్రస్తుతమున్న 55 నుంచి 30కి తగ్గించనున్నారు. ఈ తగ్గింపు ప్రక్రియ మే 1వ తేదీ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.

Related Posts

Racist Attack on Indian Girl: భారత సంతతి బాలికపై ఐర్లాండ్‌లో అమానుష ఘటన

ఐర్లాండ్‌(Ireland)లో అత్యంత అమానుష రీతిలో జాత్యాహంకార దాడి(Racist attack) జరిగింది. ఇక్కడి వాటర్‌ఫోర్డ్‌లో ఆరేండ్ల భారతీయ సంతతి బాలిక(Indian origin Girl) తన ఇంటి ముందు ఆటుకుంటూ ఉండగా కొందరు అబ్బాయిలు సైకిళ్లపై వచ్చి దాడి జరిపారు. తిట్లకు దిగి, ఐర్లాండ్…

Nitish Kumar: వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలిస్తాం.. సీఎం కీలక ప్రకటన

అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తుండటంతో బిహార్(Bihar) సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులే టార్గెట్‌గా ప్రచారం చేపట్టారు. ఈ మేరకు యువతను ఆకట్టుకునేందుకు X వేదికగా కీలక ప్రకటన చేశారు. 2025-2030…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *