APPSC: నేడే గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

ఆంధ్రప్రదేశ్‌(AP)లో గ్రూప్-2 మెయిన్స్‌(Group-2 Mains) పరీక్ష నిర్వహణపై నెలకొన్న గందరగోళానికి తెరపడింది. అనేక ట్విస్టుల మధ్య APPSC పరీక్ష నిర్వహణకే మొగ్గు చూపింది. దీంతో ఇవాళ (ఫిబ్రవరి 23) రాష్ట్ర వ్యాప్తంగా 175 కేంద్రాల్లో గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ జరగనుంది. ఇప్పటికే ప్రిలిమ్స్(Prelims) ద్వారా 92,250 మంది మెయిన్స్ రాసేందుకు క్వాలిఫై(Qualify) అయ్యారు. కాగా మార్నింగ్ 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందని కమిషన్ పేర్కొంది. అభ్యర్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాల(Exam Centers)కు చేరుకోవాలని సూచించింది. నిమిషం ఆలస్యమైన ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు.

తప్పుడు ప్రచారం నమ్మొద్దు: APPSC

కాగా రోస్టర్ రిజర్వేషన్ల (Roster Reservations) సమస్య తేలేదాకా పరీక్షను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం APPSCకి లేఖ రాసినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయి.తాజాగా, ఈ ప్రచారంపై ఏపీపీఎస్సీ అధికారికంగా స్పందించింది. ఇప్పడు పరీక్ష వాయిదా వేస్తే హాల్ టికెట్లు(Hall-Tickets) డౌన్లోడ్ చేసుకున్న84,921 మంది నిజమైన అభ్యర్థుల మానసిక, శారీరక స్థితిపై ప్రభావం చూపుతుందని తెలిపింది. అయితే, గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసినట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఏ పరిస్థితుల్లోనూ పరీక్షను వాయిదా వేయబోమంది. ప్లాన్ చేసినట్లుగానే పరీక్ష నిర్వహిస్తామని APPSC స్పష్టం చేసింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *