Prabhas: ప్రభాస్ సినిమాతో పోటీకి సిద్ధమైన మరో సినిమా.. డంకీతో పాటు ఆ మూవీ..?

మన ఈనాడు:

క్రీస్మస్​ సీజన్ హౌజ్ ఫుల్ అయిపోయింది. డిసెంబర్ 20 నుంచి 22 వరకు సినిమా జాతర జరగనుంది. అందులో అందరిచూపు సలార్‌పైనే ఉంది. డిసెంబర్ 22న విడుదల కానుంది ఈ చిత్రం. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ పార్ట్ 1పై అంచనాలు మామూలుగా లేవు. దీనికి పోటీగా అదే రోజు షారుక్ ఖాన్ డంకీ కూడా వస్తుంది. సలార్, డంకీ కంటే ఓ రోజు ముందే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
క్రిస్మస్ సీజన్‌కు ప్రభాస్ ఇచ్చిన షాక్‌తో అన్నీ తప్పుకున్నాయి.. నేనున్నా అంటూ షారుక్ ఖాన్ మాత్రం అలాగే అడ్డంగా నిలబడిపోయారు. దాంతో ఇటు సలార్.. అటు డంకీ మధ్య అసలు పోటీ నడుస్తుందిప్పుడు. కానీ ఈ రెండింటినీ కంగారు పెడుతున్న సినిమా మరోటి ఉంది. అందరూ దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. 1000 కోట్ల రేంజ్ ఉన్న మన సినిమాల్నే అంతగా భయపెడుతున్న ఆ సినిమా ఏంటి..?

6 నెలల ముందే క్రిస్మస్ సీజన్ హౌజ్ ఫుల్ అయిపోయింది. డిసెంబర్ 20 నుంచి 22 వరకు సినిమా జాతర జరగనుంది. అందులో అందరిచూపు సలార్‌పైనే ఉంది. డిసెంబర్ 22న విడుదల కానుంది ఈ చిత్రం. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ పార్ట్ 1పై అంచనాలు మామూలుగా లేవు. దీనికి పోటీగా అదే రోజు షారుక్ ఖాన్ డంకీ కూడా వస్తుంది. సలార్, డంకీ కంటే ఓ రోజు ముందే మరో సినిమా వస్తుంది. అదే ఆక్వామెన్ ది లాస్ట్ కింగ్‌డమ్. డిసెంబర్ 20న విడుదల కానున్న ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇండియాలోనూ వేలాది థియేటర్లలో ఆక్వామెన్ దండయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఈ హాలీవుడ్ సినిమాతో మనకు ప్రాబ్లమ్ ఏంటి అనుకోవచ్చు కానీ ఔట్ సైడ్ ఇండియా అంతా ఆక్వామెన్ హవానే కనిపిస్తుంది.

ఆక్వామెన్ రాకతో ఓవర్సీస్‌లో సలార్, డంకీకి భారీ దెబ్బ తప్పదు. పైగా ఈ మధ్య హాలీవుడ్ సినిమాలకు మన దగ్గర ఆదరణ పెరిగింది. మల్టీప్లెక్స్ స్క్రీన్స్ కూడా బాగానే ఇస్తున్నారు. ఇండియా వరకు ఎలాగోలా ప్రభాస్, షారుక్ మేనేజ్ చేసినా.. ఓవర్సీస్‌లో మాత్రం ఆక్వామెన్ ఆధిపత్యం భారీగానే ఉంది. ముఖ్యంగా US, UK లాంటి దేశాల్లో ఈ నీటి వీరుడితో మన హీరోలు యుద్ధం చేయాల్సిందే..!

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *