Engineering Fees: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంజినీరింగ్‌లో పాత ఫీజులే కొనసాగించాలని సర్కార్ నిర్ణయం

తెలంగాణ(Telangana)లో ఇంజినీరింగ్(Engineering) చేయాలనుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ ఫీజుల(Engineering Fees)ను పెంచకూడదని నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత ఫీజులనే ఈ ఏడాది కూడా కొనసాగించాలని సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో వేలాది మంది విద్యార్థుల(Students)కు భారీ ఊరట లభించినట్లయింది. ఈ ఉత్తర్వులు B.Tech, B.E, M.Tech, M.E, B-ఒకేషనల్ వంటి అన్ని రకాల ఇంజినీరింగ్ కోర్సులకు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఇటీవల ఇంజినీరింగ్ కాలేజీల(Engineering colleges)లో ఫీజులు భారీగా పెరిగే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని

ఈ మేరకు ఫీజుల ఖరారుకు ముందు సమగ్రంగా అధ్యయనం చేయాలని, ఇతర రాష్ట్రాల్లోని విధానాలను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఎంసెట్ కౌన్సెలింగ్(TG EAPCET 2025 Counseling) ప్రక్రియను సకాలంలో ప్రారంభించేందుకు, పాత ఫీజుల (గరిష్ఠంగా రూ.1.65 లక్షలు) ప్రకారమే అడ్మిషన్లు(Admitions) చేపట్టాలని యోచించారు. ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాత ఫీజులనే కొనసాగిస్తూ తుది నిర్ణయం తీసుకుంది.

TS EAMCET Counselling: Admission into B.Tech Agriculture Engineering and  Food Technology under MPC Stream | Sakshi Education

వారికి కూడా పాత ఫీజులే వర్తింపు

అంతేకాకుండా, పాలిటెక్నిక్ డిప్లొమా(Diploma) పూర్తి చేసి ECET ద్వారా నేరుగా బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో ప్రవేశాలు పొందే విద్యార్థులకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుంది. వారికి కూడా పాత ఫీజులనే వర్తింపజేయనున్నారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఫీజులపై నెలకొన్న గందరగోళానికి తెరపడటంతో పాటు, కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *