Khammam Politics: కొత్తగూడెం BRS పై బరిలోకి దిగనున్న జలగం?

-By Roja

మ‌న ఈనాడుః ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో గంటగంట‌కు కీలక ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాలేరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ హస్తం పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధం అయ్యారు. ఈక్ర‌మంలో కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ రెబల్ గా బరిలోకి దిగేందుకు జలగం వెంకట్రావు రెడీ అయ్యార‌ని సమాచారం.

ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు (Jalagam Venkatrao) బీఆర్ఎస్ రెబల్ గా బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఆయన కొత్తగూడెం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ కారు గుర్తుపై గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యేగా జలగం రికార్డు సృష్టించారు. అయితే 2018లో కాంగ్రెస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వనమా బీఆర్ఎస్ గూటికి చేరారు.

దీంతో జలగం వెంకట్రావుకు బీఆర్ఎస్ లో ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనకు ఈ ఎన్నికల్లో టికెట్ కూడా రాలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ లో చేరి కొత్తగూడెం నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. అందుకు కాంగ్రెస్ కూడా ఓకే చెప్పింది. కానీ పొత్తుల్లో భాగంగా హస్తం పార్టీ ఆ సీటును సీపీఐకి కేటాయించడంతో జలగం కాంగ్రెస్ లో చేరిక ఆగిపోయింది.

కార్యకర్తల నుంచి ఒత్తిడి రావడంతో బీఆర్ఎస్ రెబల్ గా పోటీ చేసేందుకు వెంకట్రావు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ కేడర్ తనకే అండగా నిలిచే అవకాశం ఉందని జలగం అంచనా వేస్తున్నట్లు సమాచారం. రేపు జలగం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జలగం పోటీ చేయడంతో నియోజకవర్గంలో పరిస్థితులు మారుతాయన్న చర్చ సాగుతోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *