“గదర్ 2” సెన్సేషన్..డే 6 కూడా రికార్డు వసూళ్లు

లేటెస్ట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర భారీ వసూళ్లతో డూమ్ లేపుతున్న నయా చిత్రం “గదర్ 2”. దర్శకుడు అనిల్ శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సన్నీ డియోల్ హీరోగా నటించగా అమీషా పటేల్ అయితే హీరోయిన్ గా నటించింది. మరి ఈ చిత్రం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సీక్వెల్ తో వచ్చినప్పటికీ ట్రేడ్ వర్గాలు షాక్ అయ్యేలా ఓపెనింగ్స్ ని ఈ చిత్రం అందుకుంది.

అంతే కాకుండా నార్త్ లో అయితే సీక్వెల్స్ లో ఓ బెంచ్ మార్క్ వసూళ్లు కొల్లగొడుతుండగా లేటెస్ట్ గా కూడా భారీ మార్క్ 200 కోట్ల మార్క్ ని కూడా క్రాస్ చేసి అదరగొట్టింది. ఇక ఈ చిత్రం అయితే లేటెస్ట్ గా ఆరవ రోజు కూడా సూపర్ స్టాండర్డ్ వసూళ్లు రాబట్టినట్టుగా తెలుస్తుంది. మరి డే 6 అయితే ఈ చిత్రం 32.37 కోట్ల గ్రాస్ ని అందుకోగా 6 రోజుల్లో ఈ చిత్రం మొత్తం 261.35 కోట్ల గ్రాస్ ని ఇప్పటివరకు అయితే రాబట్టింది. అలాగే వరుసగా ఆరు రోజులు పాటు 30 కోట్లకి పైగా వసూళ్లు అయితే అందుకున్న అతి కొద్ది చిత్రాల్లో ఒకటిగా “గదర్ 2” నిలిచింది.

గదర్ 2 చిత్రం రిలీజ్ తర్వాత పాకిస్థాన్‌ను పరేషాన్ చేశామనే వాదనలో బలం లేదు. ఎందుకంటే వారిని అసంతృప్తికి గురి చేయలేదు. మీరు చెప్పి చెప్పి వార్తలు రాయడం వల్ల ఆ వాదన అలా ప్రచారమైంది. నేను వాఘా బోర్డర్ వద్దకు వెళ్లినప్పుడు పాకిస్థాన్ ప్రజలు నాతో చాలా స్నేహంగా ఉన్నారు. నన్ను చూసి చాలా సంతోషంగా చేతులు ఊపారు. అంతకంటే వారి నుంచి కావాల్సిన ప్రేమ ఏముంది అని సన్నీడియోల్ అన్నారు.

గదర్ 2 సినిమా ప్రేక్షకుల అంచనాలు లేకపోతే ఇలాంటి రెస్సాన్స్, ఆదరణ ఉండేది కాదు. ప్రతీ ఒక్కరు ఈ సినిమాపై చూపిస్తున్న ప్రేమకు చాలా ఆనందం కలుగుతున్నది. చాలా మంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నామని చెప్పడం ఇంకా ఆనందం కలిగిచింది. ఆ విషయం తెలిసినప్పుడు కలిగిన తృప్తి మాటల్లో చెప్పలేం అని సన్నీడియోల్ అన్నారు.

Share post:

లేటెస్ట్