పాక్‌లో విధ్వంసం.. ఐదు చర్చిలపై దాడులు.. అమెరికా ఆందోళన

US On Pakistan Church Attack : పాకిస్థాన్‌లో చర్చి​లపై దాడి జరిగిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. శాంతియుత భావప్రకటనా స్వేచ్ఛకు మద్దతివ్వాలని పాకిస్థాన్​ అధికారులను కోరింది.

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో ఐదు చర్చిలపై దాడి జరిగింది. ఇస్లాం మత గ్రంథాన్ని అపవిత్రం చేశారన్న ఆరోపణలు రావడంతో ఈ దాడి జరిగినట్టు తెలుస్తున్నది. దాదాపు 100 మంది కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు.

లాహోర్‌, ఆగస్టు 16: పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో ఐదు చర్చిలపై దాడి జరిగింది. ఇస్లాం మత గ్రంథాన్ని అపవిత్రం చేశారన్న ఆరోపణలు రావడంతో ఈ దాడి జరిగినట్టు తెలుస్తున్నది. దాదాపు 100 మంది కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. చర్చిలను ధ్వంసం చేసి వస్తువులను తగులబెట్టారు.

ఓ బిషప్‌ మాట్లాడుతూ దాడి సందర్భంగా బైబిళ్లను అపవిత్రం చేశారని, క్రైస్తవులను హింసించారని చెప్పారు. కాగా, పాకిస్థాన్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరిగాయి. రెండు రోజుల కిందట ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం లీటరు ఇంధనంపై దాదాపు రూ.20 వరకు పెంచింది. దీంతో లీటరు పెట్రోల్‌ ధర రూ. 290కి పెరుగగా, డీజిల్‌ (హైస్పీడ్‌) ధర రూ. 293కి చేరింది

Share post:

లేటెస్ట్