
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న పీఎం కిసాన్(PM Kisan) సమ్మాన్ నిధి పథకం 20వ విడత చివరికి విడుదలైంది. ఆగస్ట్ 2 (శనివారం), 2025 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన బహిరంగ సభలో ఈ వాయిదాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన రూ.20 వేల కోట్ల నిధులను విడుదల చేసి, అర్హత కలిగిన 9.7 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ చేశారు.
పీఎం కిసాన్ పథకం క్రింద అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి మూడు విడతలుగా మొత్తం రూ.6,000లు అందిస్తారు. గత 19వ విడత ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈసారి వాయిదా పొందేందుకు రైతులు e-KYC ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. ఆధార్ ఆధారిత చెల్లింపులు, భూమి సంబంధిత వివరాలు నమోదు చేయడం కూడా అవసరం.
e-KYC తప్పనిసరి
ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే e-KYC తప్పనిసరి. నిధుల విడుదలకు ముందు రైతులు తప్పనిసరిగా e-KYC, భూమి ధృవీకరణ వంటి ముఖ్యమైన ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తి చేయని వారికి నిధులు రాకపోవచ్చు..
e-KYC పూర్తిచేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి:
- PM-KISAN మొబైల్ యాప్ లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా e-KYC చేయవచ్చు.
- CSCలు / రాష్ట్ర సేవా కేంద్రాల్లో బయోమెట్రిక్ ఆధారిత e-కీచ్ చేసుకోవచ్చు.
- ఆధికారిక వెబ్సైట్ లేదా యాప్లో OTP ఆధారంగా e-కీచ్ చేయవచ్చు.
e-KYC పూర్తి చేసే విధానం:
స్టెప్ 1: pmkisan.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయండి
స్టెప్ 2: ‘రైతు కార్నర్’ సెక్షన్లోకి వెళ్లండి
స్టెప్ 3: ‘e-KYC’ లేదా ‘మొబైల్ నంబర్ అప్డేట్’ క్లిక్ చేయండి
స్టెప్ 4: ఆధార్ నెంబర్ నమోదు చేసి, OTPతో ధృవీకరించండి
PM Kisan 20 వ విడతకు ఎవరు అర్హులు?
పీఎం కిసాన్ 20 వ విడత అర్హత పొందాలంటే ఈ క్రింది విదంగా ఉండాలి.
భారత పౌరుడై ఉండాలి
స్వంత సాగుభూమి కలిగి ఉండాలి
చిన్న/సన్నకారు రైతు అయి ఉండాలి
ఆదాయపు పన్ను దాఖలుచేయని వారు
నెలవారీ పెన్షన్ రూ.10,000 కన్నా ఎక్కువ ఉండకూడదు
సంస్థాగత భూస్వామ్యం ఉండకూడదు
PM Kisan ఎలా అప్లై చేయాలి?
1. అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.inకి వెళ్లండి
2. ‘New Farmer Registration’పై క్లిక్ చేయండి
3. ఆధార్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయండి
4. ఫారమ్ను సమర్పించి ప్రింట్ తీసుకోండి
ఏవైనా సందేహాల కోసం 155261 లేదా 011-24300606 నంబర్లకు కాల్ చేయవచ్చు.