ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ (Prudhvi Raj) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు తాజాగా జరిగిన ‘లైలా (Laila Pre Release Event)’ మూవీ ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమా ఫంక్షన్ లో అయినా సరే వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్న పృథ్వీ తాజాగా లైలా ఈవెంట్లో వైస్సార్సీపీ నేతలను మేకలతో పోలుస్తూ కామెంట్స్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో వైస్సార్సీపీ అభిమానులు లైలా చిత్రాన్ని బాయ్ కాట్ (Boycott Laila movie) చేయాలంటూ ట్రెండ్ చేశారు.

మాటతో చిచ్చు లేపిన పృథ్వీ
అయితే తన మాటలతో చిచ్చులేపిన పృథ్వీ రాజ్ ప్రస్తుతం ఆస్పత్రిపాలైనట్లు సమాచారం. ఆయనకు హైబీపీ రావడంతో సన్నిహితులు హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిసింది. దీనికి సంబంధించి కొన్ని విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో పృథ్వీ ఆస్పత్రి బెడ్ పై పడుకుని చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకుని ఉండటం చూడొచ్చు.
Actor “Thirty Years Industry” Prudhvi Raj has been hospitalized due to high BP.#PrudhviRaj #Laila
— The Cine Gossips (@TheCineGossips) February 11, 2025






