Mana Enadu : ప్రపంచానికే అన్నపూర్ణగా భారతదేశాన్ని నిలబెడుతున్న అన్నదాతల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం (Central Govt) కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులను ప్రగతి బాటలో నడిపేందుకు ఎన్నో కార్యక్రమాలు తీసుకువస్తోంది. ఈ క్రమంలోనే కర్షకులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం-కిసాన్ పథకం (PM Kisan Scheme) తీసుకొచ్చింది.
ఈ పథకం 18వ విడత నిధులు ఇవాళ (అక్టోబర్ 5వ తేదీన) విడుదల కానున్నాయి. ఈ స్కీమ్ ద్వారా మొత్తం 9 కోట్ల మంది పైగా రైతుల (Farmers)కు లబ్ధి చేకూరనుంది. మరి ఆ లబ్ధిదారుల్లో మీరున్నారా.. మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయో స్టేటస్ ఇలా ఈజీగా చెక్ చేస్కోండి.
స్టేటస్ ఇలా ఈజీగా చెక్ చేసుకోండి:
- www.pmkisan.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- ఓపెన్ కాగానే.. “Beneficiary List” ఆప్షన్పై క్లిక్ చేయండి.
- మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలను సెలెక్ట్ చేయండి.
- లబ్ధిదారుల జాబితా కోసం ”Get Report” ఆప్షన్పై క్లిక్ చేయండి.
- మీ గ్రామంలోని లబ్ధిదారుల పేర్లు అక్కడ కనిపిస్తాయి. అందులో మీ పేరు ఉందో? లేదో? చెక్ చేసుకోండి.
మీ అకౌంటులో పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయా లేదా ఇలా తెలుసుకోండి :
- ఇన్స్టాల్మెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్ ఓపెన్ చేయాలి.
- Know Your Status అనే ఆప్షన్పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయండి.
- రిజిస్ట్రేషన్ వివరాలు లేకపోతే Know Your Registration Number పై క్లిక్ చేస్తే మీ వివరాలు వచ్చేస్తాయి.
- Get OTPపై క్లిక్ చేస్తే మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేస్తే స్క్రీన్పై మీ బెనిషియరీ స్టేటస్ కనిపిస్తుంది.
- ఒకవేళ మీకు డబ్బులు పడలేదంటే మీరు ఈ – కేవైసీ చేయించలేదని అర్థం.
e-KYC ఇలా ఈజీగా చేసుకోండి :
పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ లోకి లాగిన్ అవ్వగానే.. హోమ్ పేజీలో కుడివైపున e-KYC ఆప్షన్పై కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి.. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ‘Search’ ఆప్షన్పై క్లిక్ చేస్తే.. మీ వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. ఓటీపీ సాయంతో ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.






