INDW vs NZW ODI: న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు.. 2-1తో సిరీస్ కైవసం

Mana Enadu: న్యూజిలాండ్​ మహిళల(New Zealand Women)తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్​ను భారత్ మహిళల(India Women) జట్టు కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఇవాళ జరిగిన కీలక మ్యాచ్‌లో టీమ్ఇండియా(Team India) చెలరేగి ఆడింది. 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 44.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బ్యాటర్లలో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana) సూపర్ సెంచరీ (100)తో రాణించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (59*) హాఫ్ సెంచరీకి తోడు షెఫాలీ వర్మ 12, యస్తికా 35, జెమీమా రోడ్రిగ్స్ 22 పరుగులతో రాణించారు. కివీస్ బౌలర్లలో రోవ్ 2, సోఫీ, జానస్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

 టాస్ నెగ్గినా.. బ్యాటర్లు విఫలం

అంతకుముందు టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్(New Zealand) 49.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాటర్లలో జార్జియా 39, బ్రూక్ 89, గాజా 25, తుహుహు 24 పరుగుల చేయగా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీప్తిశర్మ 3, ప్రియా మిత్ర 2, రేణుక, సైమా చెరో వికెట్ పడగొట్టారు. కాగా తొలి వన్డేలో భారత్ నెగ్గగా, రెండో వన్డేలో న్యూజిలాండ్ గెలుపొందింది. కీలకమైన మూడో వన్డేలో భారత్ నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకుంది.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *