వయనాడ్​లో ప్రియాంక హవా.. 3.30 లక్షల ఓట్లకుపైగా ఆధిక్యం

వయనాడ్​లో ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) దూసుకుపోతోంది. అధ్వితీయమైన మెజార్టీలో విజయం వైపు అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వాయనాడ్ (Wayanad) లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ స్థానానికి ప్రియాంకా గాంధీ పోటీ చేయగా.. శనివారం జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఆమె ప్రభంజనం సృష్టిస్తోంది. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆమెకు 5 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. 3.30 లక్షల ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరికి 1.7 లక్షల ఓట్లు వచ్చాయి. బీజేపీ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆ పార్టీ అభ్యర్థి నవ్య హరిదాస్‌కు 95 వేల ఓట్లు వచ్చాయి.

2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ వరుసగా రెండోసారి ఈ సీటును గెలుచుకుని పార్లమెంటుకు చేరుకున్నారు. ఈసారి ఆయన లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు చెందిన సీపీఐ(ఎం) అభ్యర్థి అన్నీ రాజాపై 3 లక్షల 64 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి తన సభ్యత్వాన్ని నిలుపుకుంటూ వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. అందుకే రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ ఇక్కడ జరుగుతున్న ఉపఎన్నికలో మొదటిసారి పోటీ చేశారు.

పోటీలో వీరే..
వయనాడ్​లో ఈసారి పోటీలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉన్నారు. పోటీలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (CPM) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుంచి సత్యన్ మొకేరి బరిలోకి దిగారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి నవ్య హరిదాస్ కూడా పోటీ చేశారు. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 16 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో తేలిపోనుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *