Border-Gavaskar Trophy: ఆస్ట్రేలియాకు బిగ్​ షాక్​

భారత్​తో జరుగుతున్న బోర్డర్​ గవాస్కర్​ ట్రోపీ (Border-Gavaskar Trophy 2024–25) మొదటి టెస్టులో దారుణ ఓటమితో భంగపడిన ఆసీస్​ జట్టుకు రెండో టెస్ట్‌కు ముందు మరో గట్టి షాక్ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు నుంచి కీలక ప్లేయర్ బయటకు వెళ్లిపోయాడు. స్టార్ సీమర్ జోష్ హేజల్‌వుడ్ (Josh Hazlewood) సెకండ్ టెస్ట్‌కు దూరమయ్యాడు. నడుం కింది భాగంలో నొప్పి రావడంతో హేజల్‌వుడ్ ఈ విషయాన్ని మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లాడు . అతడిని పరీక్షించిన మెడికల్ టీమ్ రెస్ట్ అవసరమని సూచించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.

పెర్త్ టెస్ట్‌లో ఆసీస్ బ్యాటింగ్​, బౌలింగ్​ విభాగాల్లో విఫలమై ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన హేజల్‌వుడ్ మిగతా బౌలర్ల కంటే మెరుగ్గా రాణించాడు. అలాంటి ప్లేయర్​ జట్టుకు దూరమవడం ఆసీస్‌కు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. పరిస్థితి మెరుగవకపోతే సిరీస్ మొత్తానికీ అతడు దూరమయ్యే ప్రమాదం ఉందని సమాచారం. దీంతో కమిన్స్ సేన ఇబ్బందుల్లో పడిపోయింది. హేజల్‌వుడ్ స్థానంలో యంగ్ పేసర్ స్కాట్ బోలాండ్‌ను సెలెక్ట్ చేసింది టీమ్​ మేనేజ్​మెంట్​. అతడితో పాటు సీన్ అబాట్, డొగ్గెట్‌ను కూడా ఎంపిక చేసింది. అయితే ఇప్పటికే ‘ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌’ టీమ్‌లో ఉన్న బోలాండ్.. వార్మప్ మ్యాచ్‌లో నిరూపించుకుంటే పింక్ టెస్ట్ తుది జట్టులో స్థానం దక్కించుకునే అవకాశాలున్నాయి.

భారత్ (Team India)​, ఆస్ట్రేలియా (Team Australia) ప్రతిష్ఠాత్మకంగా భావించే బోర్డర్​ గవాస్కర్​ ట్రోపీ మొదటి టెస్టులో భారత్​ రెండు విభాగాల్లో రాణించి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆసీస్​ను 295 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసింది. తొలి ఇన్నింగ్స్​లో కేవలం 150 పరుగులే చేసిన టీమిండియా.. ఈ తర్వాత పుంజుకొని 104 రన్స్​కే కంగారూ జట్టును కట్టడి చేసింది. కెప్టెన్​ బుమ్రా తన పేస్​ బౌలింగ్​తో ఆస్ట్రేలియా బ్యాటర్లను బెంబేలెత్తించి 5 వికెట్లు తీశాడు. సెకండ్​ ఇన్నింగ్స్​లో జైస్వాల్​, విరాట్​ కోహ్లీ సెంచరీలు చేయడంతో భారత్​ 487 రన్స్​ చేసి డిక్లేర్​ చేసింది. ఆ తర్వాత బుమ్రా, సిరాజ్​,హర్షిత్​ రాణా చెలరేగడంతో కంగారూ జట్టు 238 రన్స్​ చేసి ఆలౌట్​ అవడంతో భారత్​ 295 రన్స్​ తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టు డిసెంబర్​ 6 నుంచి అడిలైడ్​లో జరగనుంది.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *