గోల్డెన్ టెంపుల్​ వద్ద కాల్పులు.. మాజీ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం

Mana Enadu : పంజాబ్ రాష్ట్రంలోని అమృత్​సర్ స్వర్ణదేవాలయం (Golden Temple) ద్వారం కాల్పులు కలకలం సృష్టించాయి. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్​బీర్ సింగ్ బాదల్(Sukhbir Singh Badal)​పై ఆలయ పరిసరాల్లో హత్యాయత్నం జరిగింది. ఆయన​పై అతి సమీపం నుంచి ఓ దుండగుడు కాల్పులు జరపగా.. తుపాకీ గురితప్పింది. దీంతో సుఖ్​బీర్ సింగ్ ప్రాణాలతో తప్పించుకున్నారు. అయితే నిందితుడు కాల్పులు జరపడానికి గల కారణాలు తెలియరాలేదు.

ఇదీ జరిగింది?

శిక్షలో భాగంగా స్వర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద సుఖ్‌బీర్‌ చక్రాల కుర్చీపై కూర్చొని సేవాదార్‌ (కాపలాదారుడు)గా ఉన్నారు. ఓ వృద్ధుడు ఆయన దగ్గరకు వచ్చి.. కొన్ని అడుగుల దూరంలోనే ఉన్న అతడు ప్యాంట్‌ జేబులోంచి తుపాకీ తీసి సుఖ్‌బీర్‌పై కాల్పులు (Sukhbir Badal Firing) జరిపాడు. గమనించిన బాదల్ వ్యక్తిగత సిబ్బంది వెంటనే వృద్ధుడిని అడ్డుకున్నారు.

ఉగ్ర ముఠాతో నిందితుడికి సంబంధాలు

ఈ ఘటనలో సుఖ్‌బీర్‌ బాదల్​కు ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని నారైన్‌ సింగ్‌ చౌరాగా గుర్తించారు. అతడు గతంలో బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ అనే ఉగ్ర ముఠాలో పని చేసినట్లు పలు మీడియాల్లో కథనాలు పేర్కొన్నాయి.

శిక్ష సమయంలో కాల్పులు

శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. 2007-17 మధ్య కాలంలో పార్టీతో పాటు వారి ప్రభుత్వం రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు అకాల్ తఖ్త్‌(Akal Thakth) నిర్ధరించి పార్టీ చీఫ్‌ సుఖ్‌బీర్‌ను దోషిగా తేల్చి సేవకుడిగా అమృత్‌సర్​లోని స్వర్ణదేవాలయంలో పాత్రలు, బూట్లు శుభ్రం చేయాలని ఆదేశించింది. దీంతో ఆయన మంగళవారం నుంచి ఈ శిక్షను అనుభవిస్తున్న సమయంలో బుధవారం రోజున ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *