సిద్దిఖీ కంటే ముందే సల్మాన్‌ ఖాన్‌ మర్డర్ ప్లాన్‌

Mana Enadu : ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ (Baba Siddique) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఆయన కంటే ముందే బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)ను హత్య చేయాలని షూటర్లు ప్లాన్‌ చేశారని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అది సాధ్యం కాకపోవడంతో బాబా సిద్దిఖీని హత్య చేసినట్లు.. ఈ కేసుకు సంబంధించి నిందితుల ఇంటరాగేషన్‌లో తెలిసినట్లు తెలిపాయి. తమ హిట్‌ లిస్ట్‌లో సల్మాన్‌ ఖాన్‌ టాప్‌లో ఉన్నట్లు షూటర్‌ ఒప్పుకున్నట్లు దర్యాప్తు బృందం తెలిపింది.

సెక్యూరిటీ వల్ల సల్మాన్ బతికిపోయాడు

“తొలుత సల్మాన్ ఖాన్ ను హత్య చేయాలని మాకు ఆదేశాలు వచ్చాయి. ఆయన ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించాం. ఆయన వద్ద టైట్ సెక్యూరిటీ ఉండటంతో.. మేము బాబా సిద్దిఖీని టార్గెట్‌ చేసి అతణ్ని మట్టుబెట్టాం.” అని నిందితుడు విచారణలో చెప్పినట్లు దర్యాప్తు బృందం తెలిపింది. దీనికి సంబంధించిన వాంగ్మూలాలు, డిజిటల్‌ ఆధారాలను కూడా అధికారులు సేకరించినట్లు వెల్లడించింది.

హిట్ లిస్టులో జీషాన్

ఇక అక్టోబర్‌ 12వ తేదీన ముంబయిలోని బాంద్రా వద్ద జీషాన్‌ సిద్దిఖీ (zeeshan siddique) కార్యాలయం సమీపంలో బాబా సిద్దిఖీని షూటర్లు కాల్చిచంపారు. ఆ సమయంలో జీషాన్‌ అక్కడ లేకపోవడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. తమ హిట్‌ లిస్ట్‌లో అతడు కూడా ఉన్నట్లు నిందితులు తెలిపారు.

సల్మాన్ కు వై ప్లాస్ కేటగిరీ సెక్యూరిటీ

మరోవైపు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ (Lawrence Bishnoi Gang) ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌ను హత్య చేస్తామని బెదిరించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఆయనకు వై ప్లస్‌ కేటగిరి భద్రతను కల్పించారు. ప్రస్తుతం రెండు ఎస్కార్ట్‌ వాహనాలతో సహా దాదాపు 60 మంది సిబ్బంది ఆయన రక్షణ బాధ్యతల్లో ఉన్నారు. ప్రస్తుతం అమెరికాలోని జైల్లో ఉన్న అన్మోల్‌ బిష్ణోయ్‌ (Anmol Bishnoi) పేరును అధికారులు మహారాష్ట్ర వ్యవస్థీకృత నేర నియంత్రణ చట్టం (మకోకా) కింద చేర్చారు. ఇతడే ముగ్గురు షూటర్లకు బ్రెయిన్‌ వాష్‌ చేసి బాబా సిద్దిఖీ హత్యకు ప్రేరేపించినట్లు సమాచారం.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *