Champions Trophy 2025: అఫీషియల్.. హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ

మినీ ప్రపంచకప్‌గా పేరొందిన ఛాంపియన్స్‌ ట్రోఫీ(Champions Trophy) నిర్వహణ వేదికపై సందిగ్ధం వీడింది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ వచ్చే ఫిబ్రవరిలో పాకిస్థాన్‌(Pakistan)లో జరగాల్సి ఉంది. అయితే భారత్-పాక్ దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో టీమ్ఇండియా(Team India) ఆ దేశంలో పర్యటించదని బీసీసీఐ(Board of Control for Cricket in India) తేల్చి చెప్పింది.

అయితే భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లను వేరే దేశంలో నిర్వహిస్తే (Hybrid model) మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటామని భారత్ చెప్పింది. దీంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించనున్నట్లు ICC అఫీషియల్‌గా ప్రకటించింది. ఐసీసీ ఈవెంట్ల(ICC Eventsలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లను తటస్థ వేదిక(A Neutral Platform)లపై నిర్వహిస్తారని ఐసీసీ పేర్కొంది.

2028 T20 వరల్డ్ కప్‌కి పాక్ ఆతిథ్యం

గత కొన్ని రోజులుగా BCCI, PCBలతో ICC చర్చలు జరిపింది. ఈ క్రమంలో ఇరు బోర్డులు తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో జరిపేందుకు అంగీకరించాయి. అయితే 2024-27 మధ్య జరిగే ఐసీసీ ఈవెంట్లలో టీమ్ఇండియా, పాకిస్థాన్ మ్యాచులన్నీ తటస్థ వేదికల్లోనే నిర్వహిస్తారు. 2025 ఉమెన్స్ వరల్డ్ కప్(Womens WC), 2026లో మెన్స్ T20 వరల్డ్ కప్ భారత్‌లో జరగనుంది. ఈ రెండు ఈవెంట్లకు పాక్ జట్టు భారత్‌కు రాదు. వీటిని ఇతర దేశాలలో నిర్వహించాల్సి ఉంటుంది. ఇక 2025 ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను తర్వలోనే ప్రకటిస్తామని ఐసీసీ పేర్కొంది. మరోవైపు 2028 T20 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను కూడా పాకిస్థాన్(Pakistan) దక్కించుకుంది.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *