సంధ్య థియేటర్‌ తొక్కిసలాట.. పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్‌

Mana Enadu : హైదరాబాద్ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట (Sandhya Theatre Stampede) ఘటనపై పోలీసులు కీలక ప్రకటన జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్‌ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం పోస్ట్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ (Hyderabad Police) పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

‘‘తొక్కిసలాట ఘటనపై సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. కొందరు ప్రజలను అపోహలకు గురిచేసేలా వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) రాకముందే తొక్కిసలాట జరిగినట్లు కొందరు తప్పుడు వీడియోలు పోస్ట్‌ చేసిన అంశం మా దృష్టికి వచ్చింది.

ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో (Sandhya Theatre Case Video) రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. కావాలని పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు పోస్ట్‌లు పెడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే మాకు అందించవచ్చు’’ అని నగర పోలీసులు ఓ ప్రకటన జారీ చేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *