మన్మోహన్ పార్థివదేహానికి ‘తెలుగు’ ముఖ్యమంత్రుల నివాళులు

Mana Enadu : మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అనారోగ్య కారణాలతో గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. పార్థివదేహాన్ని దిల్లీలోని ఆయన నివాసంలో ఉంచగా ప్రముఖులు సందర్శిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ (PM Modi) సహా కీలక నేతలు ఆయనకు అంజలి ఘటించారు. తాజాగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు వేర్వేరుగా ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు.

ముఖ్యమంత్రుల ఘన నివాళి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (AP CM Revanth Reddy)తో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, తెలంగాణ ఎంపీలు నెహ్రూమార్గ్ లోని మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu), కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు శబరి, కేశినేని చిన్ని మన్మోహన్ పార్థివదేహానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.

ఆయన మరణం తీరని లోటు

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ మరణంతో దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని అన్నారు.  ఆయన ఆశయాలను మనమంతా ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.  దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని..  ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు.  మన్మోహన్‌సింగ్ మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు.  దేశాన్ని ఆర్థికంగా మన్మోహన్‌ కొత్త పుంతలు తొక్కించారని.. ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమైనవని కొనియాడారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *