‘పుష్ప-2’ సినిమాకు వెళ్తే ‘బేబీ జాన్’ చూపించారు.. ఎక్కడంటే?

Mana Enadu : రాజస్థాన్ జయపురలోని ఓ థియేటర్ లో పుష్ప-2 (Pushpa 2) సినిమా చూసేందుకు ప్రేక్షకులు వెళ్లారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చిత్ర టికెట్లను కొనుగోలు చేశారు. కొందరు ఆన్ లైన్ లో ముందే బుక్ చేసుకోగా.. మరికొందరు థియేటర్ వద్ద కొనుగోలు చేశారు. ఇక కూల్ డ్రింక్స్, పాప్ కార్న్, సమోసా లాంటి వాటిని తీసుకుని హాయిగా సినిమా ఎంజాయ్ చేద్దామని హాల్ లోకి వెళ్లారు. స్క్రీన్ పై మూవీ ప్రారంభం కాగానే ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వారు పుష్ప-2 సినిమా టికెట్లు కొని వెళ్తే అక్కడి థియేటర్ లో వరుణ్ ధావన్ నటించిన బేబీ జాన్ సినిమా స్క్రీనింగ్ వేశారు.

పుష్ప-2 కోసం వెళ్తే బేబీ జాన్ చూపించారు

ఇదే విషయంపై థియేటర్ యాజమాన్యాన్ని ఆరా తీయగా వారు బేబీ జాన్ (Baby John) సినిమాను చూడమని బలవంతం చేశారట. తాము టికెట్ బుక్ చేసుకుంది ‘పుష్ప 2’ సినిమా కోసం అని, బేబీ జాన్ మూవీ తమకు వద్దంటే వద్దని ప్రేక్షకులు హాలులోనే హంగామా చేశారు. ముందస్తు సమాచారం లేకుండా సినిమా మార్చేయడం పట్ల యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. అయినా స్క్రీనింగ్ చేయకపోవడంతో చేసేదేం లేక కొందరు సినిమా చూస్తే, మరికొందరు మాత్రం రీఫండ్ కావాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

హిందీ హిస్టరీలో బ్లాక్ బస్టర్ వసూళ్లు

‘పుష్ప-2’ సినిమాకు నార్త్​లో భారీ స్థాయిలో క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. సినిమా రిలీజై 25 రోజులు అవుతున్నా హిందీ​లో పుష్ప రాజ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ సినిమా హిందీలో ఇప్పటికే రూ.700 కోట్ల వసూళ్లు (Pushpa 2 Hindi Collections) సాధించింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. హిందీ బాక్సాఫీస్ లో అత్యధిక వసూళ్లు (నెట్) సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. హిందీలో భారీ నెట్​ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ​

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *