పోంజీ కుంభకోణం (Ponzi scam) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గుజరాత్తోని బీజెడ్ గ్రూప్ సంస్థ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసి రూ.6 వేల కోట్లు సేకరించింది. ఇందులో పలువురు క్రికెటర్లు సైతం పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఈ కేసులో ఇప్పటికే ఈ సంస్థ సీఈవో భూపేంద్ర సింగ్ ఝలాను (Bhupendrasinh Zala) ఇప్పటికే గుజరాత్ సీఐడీ అరెస్ట్ చేసింది.
గిల్ రూ.1.95 కోట్ల పెట్టుబడి!
ఇదిలా ఉండగా.. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill)తోపాటు ఆ టీమ్ ప్లేయర్లు సాయి సుదర్శన్ (Sai sudarshan), రాహుల్ తెవాతియా, మోహిత్ శర్మ వంటి పలువురు ఇందులో పెట్టుబడి పెట్టారని.. వారికి త్వరలోనే సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఆ సంస్థలో పెట్టుబడి పెట్టిన రూ.450 కోట్లకు సంబంధించి లావాదేవీలపై సీఐడీ ఆరాతీస్తోంది.

అందులోభాగంగా గుజరాత్ క్రికెటర్లకు సమన్లు జారీ చేయనుంది. వారి నుంచి వివరాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనుంది. అహ్మదాబాద్ మిర్రర్ నివేదిక ప్రకారం.. ఇందులో గిల్ రూ.1.95 కోట్లు పెట్టుబడి పెట్టగా, మిగతా క్రికెటర్లు తక్కువ మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసినట్లు సమాచారం.
10 మంది ఏజెంట్ల అరెస్ట్
ప్రస్తుతం శుభ్మన్ గిల్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. సిరీస్ ముగిసిన తర్వాత అతడు భారత్కు వచ్చాక సమన్లు జారీ చేసి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటివరకు బీజెడ్ సంస్థకు చెందిన 10 మందికి పైగా ఏజెంట్లను అధికారులు అరెస్ట్ చేశారు. తమ సంస్థ ద్వారా బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇస్తామని ప్రజలను భూపేంద్ర సింగ్ నమ్మించారు.
కొద్దికాలం తర్వాత సంస్థ పనితీరుపై అనుమానం రావడంతో ఈవిషయంపై కొందరు వ్యక్తులు సీఐడీ (CID) అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కుంభకోణం (Ponzi scam) వెలుగులోకి వచ్చింది. ప్రజల డబ్బుతో నిందితుడు విలాసవంతమైన కార్లు, భవనాలు కొనుగోలు చేసినట్లు, వివిధ విద్యాసంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు.








