భారతదేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం అయిన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న (Khel Ratna Award 2024) అవార్డులను తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి నలుగురిని ఈ అవార్డు వరించింది. అందులో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత గుకేష్ (Gukesh Dommaraju), షూటింగ్ స్టార్, ఒలింపిక్స్ విన్నర్ మను బాకర్ (Manu Bhaker), హాకీ ప్లేయర్ హర్మన్ప్రీత్ సింగ్, పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్ ప్రవీణ్ కుమార్ ఖేల్రత్న అవార్డుకు ఎంపికయ్యారు.
మరోవైపు 17 మంది పారా అథ్లెట్లు సహా 32 మందిని అర్జున అవార్డులు వరించాయి. ఈ నెల 17వ తేదీన ఖేల్రత్న అవార్డులను రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడామంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ పురస్కారానికి ఎంపికైన నలుగురు క్రీడాభిమానులు కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Ministry of Youth Affairs and Sports announces the Khel Ratna Award for Olympic double medalist Manu Bhaker, Chess World Champion Gukesh D, Hockey team Captain Harmanpreet Singh, and Paralympic Gold medallist Praveen Kumar. pic.twitter.com/VD54E0EtEk
— ANI (@ANI) January 2, 2025








