‘గేమ్‌ ఛేంజర్‌’ ఈవెంట్‌.. మృతులకు పవన్‌, దిల్ రాజు ఆర్థికసాయం

గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా నటించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ నుంచి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనసేన పార్టీ తరఫున బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు.

పవన్ కల్యాణ్ రూ.10 లక్షల ఆర్థికసాయం

‘‘గత ఐదేళ్లలో కాకినాడ – రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డును ఎవరూ పట్టించుకోకపోవడంతో అది పాడై ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఈ రోడ్డు మరమ్మతుల పనుల్లో ఉంది. అయితే ఈ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారని తెలిసి చాలా బాధగా ఉంది. జనసేన పార్టీ (Janasena Party) తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థికసాయం అందిస్తాం. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని నా కార్యాలయ అధికారులకు స్పష్టం చేశాను. అని పవన్ కల్యాణ్ (Pawan kalyan) తెలిపారు.

దిల్ రాజు రూ.10 లక్షల సాయం

మరోవైపు, ఈ ఘటనపై చిత్ర నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) కూడా దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధితుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సినిమా ఈవెంట్ల నుంచి వెళ్లేటప్పుడు అభిమానులు చాలా అప్రత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జనవరి 10వ తేదీన గేమ్ ఛేందర్ సినిమా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *