‘తిరుపతిలో భక్తులు తొక్కిసలాట వల్ల చనిపోలేదు’

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీలో బుధవారం రోజున జరిగిన తోపులాట (Tirupati Stampede) తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 40కి పైగా మంది అస్వస్థతకు గురి కాగా వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన నివేదిక సీఎం చంద్రబాబు వద్దకు చేరింది.

తొక్కిసలాట వల్ల చనిపోలేదు

అయితే తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ (Chintha Mohan) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో తొక్కిసలాట వల్ల భక్తులు చనిపోలేదని ఆయన అన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచి తిండి లేకుండా క్యూలో నిలబడి ఉన్నారని తెలిపారు. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో ఆత్రుతగా పరిగెత్తారని చెప్పారు.

టీటీటీ వైఫల్యం లేదు

శరీరంలో షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం వల్ల వాళ్లంతట వాళ్లే కిందపడి పోయారని చెప్పారు. ఈ క్రమంలోనే చనిపోయి ఉంటారని.. తోపులాట వల్ల కాదని ఆయన పేర్కొన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఎవరి నిర్లక్ష్యం లేదని.. ఇందులో టీటీటీ వైఫల్యం లేనే లేదని తెలిపారు. దేవస్థానం అధికారుల పనితీరు కూడా బాగుందని. టీటీడీ అధికారులను అభినందిస్తున్నానని చింతా మోహన్ అన్నారు.

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

APL-2025: తుంగభద్ర వారియర్స్‌దే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టైటిల్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్‌(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *