‘నేనూ మనిషినే.. దేవుడిని కాదు’.. ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌

ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) తొలిసారి ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. ఇక పూర్తి వీడియో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధాని మోదీ పాల్గొన్న తొలి పాడ్ కాస్ట్ ఇదే కావడం గమనార్హం. ఇంతకీ మోదీని ఇంటర్వ్యూ చేసింది ఎవరంటే..? ప్రముఖ వ్యాపారవేత్త, జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్‌ కామత్‌ (Nikhil Kamath). ఆయన నిర్వహిస్తోన్న పాడ్‌కాస్ట్‌లో మోదీ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు పలు ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు.

ఇదే నా తొలి పాడ్ కాస్ట్

రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్‌లో (PM Modi Podcast) రాజకీయాలు, వ్యవస్థాపకత, నాయకత్వ సవాళ్లు వంటి పలు అంశాలపై ఈ ఇద్దరు ముచ్చటించినట్లు తెలుస్తోంది. పాడ్ కాస్ట్ ఆరంభంలో నిఖిల్‌ కామత్‌ మాట్లాడుతూ.. ‘ప్రధానిని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ఒకింత భయంగా ఉంది’ అని అనగా..  ‘ఇదే నా తొలి పాడ్‌కాస్ట్‌(nikhil kamath podcast). దీన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో తెలియదు మరి’ అని మోదీ అనడంతో నవ్వులు విరిశాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

నేను భగవంతుడిని కాదు కదా

రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు మీరిచ్చే సూచన ఏంటీ? అని నిఖిల్‌ కామత్‌ (Nikhil Kamath) ప్రధానిని ప్రశ్నించారు. రాజనీతి కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. ప్రజాసేవ చేయాలన్న మిషన్‌ తీసుకోవడం కోసం రావాలని.. సొంత లక్ష్యాలు నెరవేర్చుకోవడం కోసం కాదని ఆయన సమాధానమిచ్చారు. ఇక మోదీ తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన పాత ప్రసంగాల గురించి మాట్లాడారు. ‘‘అప్పుడు నేనే ఏదో అని ఉంటాను. పొరపాట్లు జరుగుతుంటాయి. నేనూ మనిషినే.. భగవంతుడిని కాదు కదా..!’’ అని అన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *