IND vs ENG 1st T20: టాస్ నెగ్గిన భారత్.. జట్టులో ఇద్దరు తెలుగు ప్లేయర్లు

ఇంగ్లండ్‌(England)తో జరుగుతున్న తొలి T20లో భారత్(Team Indai) టాస్ గెలిచి ఫీల్డింగ్(Fielding) ఎంచుకుంది. కోల్‌కతా(Kolkata)లోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో భారత్‌ తరఫున ఇద్దరు తెలుగు ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. ఆసీస్ టూర్‌లో రాణించిన నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar reddy), అంతకుముందు సౌతాఫ్రికా సిరీస్‌లో వరుస సెంచరీలు బాదిన తిలక్ వర్మ(Tilak Varma)కు జట్టులో చోటు దక్కింది. అయితే స్టార్ పేసర్ మహ్మద్ షమీ(Shami)కి తుది జట్టులో ప్లేస్ లభించలేదు. అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించనట్లుగా తెలుస్తోంది. జట్ల వివరాలు ఇలా..

Team India

సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (C), హార్దిక్ పాండ్య, నితీశ్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.

England

జోస్ బట్లర్ (కెప్టెన్‌), ఫిల్ సాల్ట్(కీపర్), బెన్ డక్కెట్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, బెథెల్, ఓవర్టన్, పాట్ అట్కీన్‌సన్, జోఫ్రా అర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *