బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) సికింద్రాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తన పాస్పోర్టును రెన్యువల్ చేయించుకున్నారు. అనంతరం పాస్పోర్టు కార్యాలయం నుంచి నేరుగా కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు.
సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
తన డిప్లమాటిక్ పాస్పోర్ట్ను సబ్మిట్ చేసి సాధారణ పాస్పోర్ట్ను తీసుకునేందుకు పాస్పోర్ట్ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్ గారు.#Telangana #KCR https://t.co/y5rrLpEKqL pic.twitter.com/Yr6B355lG0
— Telangana With KCR (@TSwithKCR) February 19, 2025
7 నెలల తర్వాత తెలంగాణ భవన్ కు
దాదాపు 7 నెలల విరామం తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ (Telangana Bhavan) కు వెళ్లారు. ఈ సందర్భంగా ఇవాళ జరుగుతున్న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం వేళ భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేయనున్నారు.
Former Telangana Chief Minister and BRS Chief KCR, accompanied by his wife Shobha, visited the Secunderabad Passport Office on February 19, 2025. KCR submitted his diplomatic passport and obtained a general one. After the renewal process, he left the office and headed to his… pic.twitter.com/0CMrVEMR8Q
— Hyderabad Mail (@Hyderabad_Mail) February 19, 2025
ఆ విషయాలపై చర్చ
మరోవైపు పార్టీ ప్లీనరీ, ప్రతినిధుల సభ, పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటుపై ఈ సమావేశంలో కేసీఆర్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో పాటు ఇచ్చిన హామీల అమలు కోసం ఒత్తిడి తెచ్చేలా చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలకు ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపైనా ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు సమాచారం.






