తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2.5 శాతం డీఏ(DA)ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్ల అదనపు భారం పడనుంది. మరోవైపు డీఏ ప్రకటనతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్కారుకు, మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.






