TTD: శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల జూన్ నెల కోటా విడుదల

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల దర్శన భాగ్యం కోసం TTD ఇవాళ (మార్చి 18) జూన్ నెలకు సంబంధించి స్పెషల్ ఎంట్రీ టికెట్ల(Special entry tickets)ను విడుదల చేయనుంది. ఈ మేరకు పలు సేవల టికెట్ల వివరాలకు సంబంధించి టీటీడీ తేదీలను ప్రకటించింది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల టికెట్లను మార్చి 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌(Online)లో విడుదల చేయనున్నారు. ఈ సేవల లక్కీ డిప్(Lucky dip) కోసం మార్చి 18 నుంచి మార్చి 20 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు మార్చి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.

వివిధ సేవల టిక్కెట్ల విడుదల ఇలా..

అలాగే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం(Arjita Brahmotsavam), సహస్రదీపాలంకరణ సేవా టికెట్ల కోటాను మార్చి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. జూన్ 9 నుంచి 11 వరకు జరిగే శ్రీవారి జ్యేష్ఠాభిషేకం టికెట్లను మార్చి 21న ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంచుతారు. వర్చువల్ సేవల దర్శన స్లాట్ల(Virtual services visit slots)ను మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. వీటితోపాటు అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 22న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల(Srivani Trust Tickets)ను అదే రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగుల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను మార్చి 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

TTD: ఈ నెల 24న రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ - TTD  to release Rs 300 special darshan tickets on 24th of this month for  November - Asianet News Telugu

దర్శన టికెట్లు, గదుల బుకింగ్ కోసం..

జూన్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మార్చి 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిలో గదుల కోటాను మార్చి 24న మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, గదుల బుకింగ్ కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ను మాత్రమే సందర్శించాలని టీటీడీ సూచించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *