Anna Lezhneva: అన్నసత్రానికి రూ.17లక్షల విరాళం అందజేసిన పవన్ సతీమణి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సతీమణి అన్నా లెజినోవా(Anna Lezhneva) హిందూ ధర్మంపై తనకున్న నమ్మకాన్ని మరోసారి చాటుకున్నారు. ఆదివారం రాత్రి తిరుమల చేరుకున్న ఆమె. శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమల(Tirumala)లోని గాయత్రి సదనంలో TTD ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాల(Declaration Papers)పై సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయం నియమాలను పాటించారు. ముందుగా ఆలయ మాడ వీధుల్లోకి చేరుకుని శ్రీ భూ వరహాస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ దర్శనమనంతరం కళ్యాణకట్టకు చేరుకుని తలనీలాలు సమర్పించారు.

ఇక ఇవాళ వేకువజామున శ్రీవారి(Tirumala Venkateswara Swamy)ని దర్శించుకొని మొక్కులు అప్పగించారు. ఆమెకు ఆలయాధికారులు వేద ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అంజేశారు. ఇక అక్కడి నుంచి తిరుమల శ్రీతరిగొండ వెంగమాంబ అన్నసత్రానికి చేరుకున్న ఆమె పవన్ తరఫున విరాళం ఇచ్చారు. అనంతరం ఆమె స్వయంగా భక్తులకు అన్నం వడ్డించారు. తర్వాత భక్తుల కలిసి తానూ అన్నసత్రంలోనే భోజనం చేశారు.  కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar) పేరిట రూ.17 లక్షలను అందించారు. ఇటీవల అగ్నిప్రమాదం(Fire Accident) నుంచి మార్క్ బయటపడిన విషయం తెలిసిందే. దీంతో ఆమె శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *