RCB vs RR: రాయల్ ఛాలెంజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ.. 11 రన్స్ తేడాతో రాయల్స్ చిత్తు

ఐపీఎల్ 2025లో ఎట్టకేలకు సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జూలు విదిల్చింది. ఈ సీజన్‌లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌(RR)తో జరిగిన మ్యాచులో RCB 11 రన్స్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఆర్సీబీ నిర్దేశించిన 206 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో రాజస్థాన్‌కు చివరి 2 ఓవర్లలో 18 పరుగులు కాగా.. కేవలం 7 పరుగులు చేసి విజయం ముంగిట బొక్కబోర్లా పడింది. ఈ విజయంతో ఆర్సీబీ 12 పాయింట్లతో 3వ ప్లేస్‌కి చేరి ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగు పర్చుకుంది. అటు రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచుల్లో 7 ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలకు దాదాపు దూరమైంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆ జట్టు టాప్-4లోకి వెళ్లడం కష్టమే.

ఓ వైపు కింగ్ కోహ్లీ.. మరోవైపు పడిక్కల్

రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన RCB విరాట్ కోహ్లీ (70 పరుగులు, 42 బంతుల్లో), దేవదత్ పడిక్కల్ (50 పరుగులు, 27 బంతుల్లో) అద్భుత ప్రదర్శన చేశారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం అందించారు. సాల్ట్ (26), ఆ తరువాత టిమ్ డేవిడ్ (23), జితేష్ శర్మ (19 నాటౌట్) చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయడంతో ఆర్సీబీ 205/5 భారీ స్కోర్‌ చేసింది.​ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ 2 వికెట్లు, ఆర్చర్, హసరంగ చెరోవికెట్ తీశారు.

Image

గెలిచే అవకాశం ఉన్నా.. చేజేతులా ఓడింది

అనంతరం 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. యశస్వీ జైస్వాల్ (49), నితీష్ రాణా (28), ధ్రువ్ జురేల్ (47) ధాటిగా ఆడినా ప్రయోజనం లేకపోయింది. ఒకానొక దశలో గెలిచే ఛాన్సున్నా ఆ జట్టు ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 194/9 స్కోర్‌కే RR పరిమితమైంది. ఆర్సీబీ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 4 వికెట్లు, కృనాల్ పాండ్య 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ చెరో వికెట్ తీశారు. 4 వికెట్లతో సత్తా చాటిన హేజిల్‌వుడ్‌కి ‘ Man of The Match’ అవార్డు దక్కింది.​

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *