Dil Raju: దిల్ రాజు కొత్త బ్యానర్‌లో మూవీ ఛాన్స్.. ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోండి!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో కీలక అడుగు వేశారు. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ ద్వారా ఇప్పటికే అనేక హిట్ చిత్రాలను అందించిన ఆయన, ఇప్పుడు ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే కొత్త బ్యానర్‌ ప్రారంభించారు. ఈ బ్యానర్‌ తో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు, నూతన కథలకు వేదిక కల్పించేందుకు ప్రారంభించారు. తాజాగా ఈ బ్యానర్‌కు సంబంధించిన లోగోను అధికారికంగా విడుదల చేశారు.

కొత్త కథలకు, చిన్న సినిమాలకు ప్రాధాన్యం

దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ ద్వారా లో-బడ్జెట్ సినిమాలు, కొత్త కంటెంట్ ఉన్న ప్రాజెక్టులకు అవకాశం కల్పించనున్నారు. కొత్త దర్శకులు, నటులు, రచయితలు వంటి టాలెంట్‌కి ఇది ఒక ఉత్తమ వేదికగా నిలవనుందని దిల్ రాజు చెబుతున్నారు. కాగా దిల్ రాజు అసలు పేరు వి. వెంకట రమణా రెడ్డి. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన, ‘దిల్’ సినిమా ఘన విజయం సాధించడంతో దిల్ రాజు అనే పేరుతో నిర్మాతగా వెలుగులోకి వచ్చారు. అప్పటి నుంచి ఒకటిన్నర దశాబ్దంగా స్టార్ ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు.

Dil Raju's Heartfelt Video As "Game Changer" Arrives On Sankranthi 2025

కష్టపడే టాలెంట్‌కు తగిన వేదిక

ఇంతకుముందు తన అనుభవాలను గుర్తుచేసుకుంటూ దిల్ రాజు మాట్లాడుతూ, “నాకు కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలొచ్చాయి. ఇండస్ట్రీకి రావాలనుకునే వారికి సరైన అవకాశం దొరకదు. అలాంటి వారికి ‘దిల్ రాజు డ్రీమ్స్’ వేదికగా ఉంటుంది. టాలెంట్, కంటెంట్ ఉన్నవారు మా టీమ్‌ను సంప్రదించవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించాం,” అని తెలిపారు.

వెబ్‌సైట్ ప్రారంభం, రిజిస్ట్రేషన్లు షురూ..

తాజాగా https://dilrajudreams.com అనే వెబ్‌సైట్‌ను లాంచ్ చేసి, అఫీషియల్‌గా రిజిస్ట్రేషన్లు ప్రారంభించినట్లు దిల్ రాజు ప్రకటించారు. కొత్త టాలెంట్ తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ కొత్త ప్రయోగం ద్వారా ఇండస్ట్రీలోకి కొత్త రక్తాన్ని తీసుకురావాలన్న దిల్ రాజు ఆలోచన అభినందనీయమైనదిగా చెబుతున్నాయి సినీ వర్గాలు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *