Rains in Telangana: మరో 5 రోజుల పాటు వర్షాలు.. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం రాత్రి వరకు కొనసాగింది. కాస్త గ్యాప్ ఇచ్చి.. మళ్లీ తిరిగి గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ (Department of Meteorology) హెచ్చరించింది. రానున్న ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు

ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. హైదరాబాద్‌లోనూ ఈదురుగాలుల తాకిడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. .

సదాశివపేట మండలంలో అత్యధికంగా 8.64 సెం.మీ. వాన 

గత 24 గంటల్లో కామారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో అత్యధికంగా 8.64 సెం.మీ వర్షపాతం నమోదనట్లు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత వరంగల్ జిల్లా కల్లెడలో 8.4 సెంటీమీటర్లు, అదే జిల్లా మంగళవారిపేటలో 7.7, నల్గొండ జిల్లా తిరుమలగిరిలో 7.7, మహబూబాబాద్జిల్లా కొత్తగూడలో 7.4, వరంగల్జిల్లా చెన్నారావుపేటలో 6.7, సూర్యాపేట జిల్లా బలరాం తండాలో 6.7, పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లిలో 6.6, కామారెడ్డి జిల్లా బోమనదేవిపల్లిలో 6.3, నల్గొండ జిల్లా నకిరేకల్‌లో 6, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్, మెదక్ జిల్లా మాసాయిపేటల్లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *